Advertisement
“వంద రూపాయల లంచం ఇవ్వనందుకు వాడి పొట్టకొట్టావ్..నీకు పుట్టగతులుండవురరేయ్…” నేను ఇలా తిట్టడం కాదు..అసలు విషయం తెలిస్తే మీరు నాకంటే ఎక్కువ బూతులు తిడతారు.. కరోనాలు,లాక్ డౌన్లూ అన్ని పెద్దవాళ్లకే..పేదవాళ్లకి బ్రతుకే ఓ పెద్ద పోరాటం..ఆకలే పెద్ద రోగం..
మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన 14 ఏళ్ల బాలుడు బండిపై గుడ్లమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు..కుటుంబ పోషణకు గుడ్ల అమ్మకమే జీవనాధారం..అయితే రోడ్డుపై బండి పెట్టుకుని ఉన్న ఆ కుర్రాడి దగ్గరికి పోలీసులు వచ్చి మొదట బండిని తీసేయాలని దబాయించారు.దాంతో ఇది తప్ప మరో ఆధారం లేదని బతిమిలాడుకోవడంతో రూ.100 రూ లంచం ఇవ్వాల్సిందిగా కోరారు..
కరోనా కారణంగా వ్యాపారం జరగట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు..నేను అంత ఇచ్చుకోలేను అని ప్రాదేయపడ్డాడు..కించిత్ కూడా జాలిలేని ఆ కసాయి ఖాకీ హృదయాలు గుడ్ల బండిని బోల్తా పడేసి,గుడ్లన్నింటిని నాశనం చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు..అసలేం జరుగుతుందో అర్దం కాని ఆ పిల్లాడు ఏడుపు మొఖంతో బిగ్గరగా అరుస్తూ,ఏడుస్తూ ఏం చేయాలో పాలుపోక రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాడు..
Advertisement
Watch Video:
Advertisements
Civic officials in Indore allegedly overturned egg cart of a small boy. The officials had warned that the egg cart would be seized if he did not leave the spot @ChouhanShivraj @OfficeOfKNath @INCIndia @INCMP @GargiRawat @RajputAditi @ndtvindia @ndtv pic.twitter.com/PnuqeLrbJh
— Anurag Dwary (@Anurag_Dwary) July 23, 2020
Advertisements
అసలే మహమ్మారి కారణంగా వ్యాపారం జరగట్లేదని, ఇప్పుడు ఈ స్టాక్ భారం కూడా తనపైనే పడిందని బోరున ఏడుస్తున్న పిల్లవాడిని చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది.. కరోనా కాలంలో పోలీసులు ముందు వరుసలో ఉండి ప్రజలను కాపాడుతున్నారని కొనియాడుతుంటే అక్కడక్కడా ఇలాంటి కలుపు మొక్కలు అసలు పోలీస్ వ్యవస్ధమీదే నమ్మకం పోయేలా చేస్తున్నాయి… ఇదంతా సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు కొందరు..