Advertisement
భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎందరో వీరులు తమ ప్రాణాలకు తెగించి మరీ బ్రిటిష్ వారితో పోరాడారు. అయినప్పటికీ మనం ఎక్కువ నెహ్రూ, గాంధీ, పటేల్, బోస్, భగత్ సింగ్ ..ఇలాంటి కొన్ని పేర్లే వింటూ ఉంటాం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు పెద్దగా పరిచయం లేని ఓ మహిళా గురించి, దేశ విముక్తి కోసం తన యవ్వనం అంతా జైలు లోనే గడిపిన యోధురాలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
గైడిన్ లియో …. సాంప్రదాయ నాగా వంశానికి చెందినామె. తమ తెగకు రాణి. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నిరంకుశంగా పాలిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలపైనా వారి ఆదిపత్యం స్టార్ట్ అయ్యింది. దీంతో తమ తెగను రక్షించే ప్రయత్నంలో గైడిన్ కజిన్ అయిన హైపో జెడోనాగ్ హెరాక అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసాడు…దీని లక్ష్యం నాగాల సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు స్వపరిపాలన.
Advertisement
ఈ ఉద్యమం గురించి తెలిసి…బ్రిటిష్ వాళ్ళు 1931 లో జెడోనాగ్ ను అరెస్ట్ చేసి ఉరి తీశారు. దీంతో ఉద్యమాన్ని నడపాల్సిన బాధ్యత గైడిన్ లియో తీసుకుంది. తమ ప్రాంతం నుండి ఎటువంటి శిస్తు కట్టొద్దు అంటూ తీర్మానం చేసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆమెతో నడిచారు. స్వచ్చందంగా విరాళాలు ఇచ్చి మరీ ఈ ఉద్యమంలో భాగం అయ్యారు.
గైడిన్ లియో ..గురించి తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1933 లో అనేక అక్రమ కేసులు బనాయించి ఆమెను అరెస్ట్ చేసారు… అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు మాత్రమే.! 10 నెలల జైలు శిక్షను యావజ్జీవంగా మార్చేశారు. ఇలా ఆమె యవ్వనమంతా అస్సాం జైళ్లలో చీకటి గదుల్లోనే గడిచిపోయింది. చివరకు మనకు స్వాతంత్రం వచ్చాక 1947 ఆమెను విడుదల చేసారు…అంటే ఆమె 14 సంవత్సరాలు జైల్లో గడిపారు…(16 – 30 Age).
Advertisements
1937 లో నెహ్రూ…. గైడిన్ లియో గురించి ” భారతదేశం ఆమెని జ్ఞప్తి తెచ్చుకునే రోజు ,మనసులో పదిలంగా దాచుకునే రోజు వస్తుంది” అని అన్నారు.
Advertisements