Advertisement
మహాభారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు, కృష్ణుడి వయస్సు ఎంత ఉంటుంది ? అనే విషయంపై ఇప్పటికీ అనేక మంది చర్చిస్తూనే ఉంటారు. అనేక మంది వారి వయస్సును ఆయా సమయంలో లెక్కలు కడుతున్నారు. అయితే పాండవులు హస్తినాపురం మొదటిసారిగా వచ్చినప్పుడు ధర్మరాజు వయస్సు 13 ఏళ్లు. అర్జునుడు ధర్మరాజు కన్నా 2 ఏళ్ల చిన్నవాడు. కనుక అతని వయస్సు 11 ఏళ్లుగా ఉండేది.
ఇక ద్రోణాచార్యుడి వద్దకు పాండవులు 12 ఏళ్ల పాటు విద్యనభ్యసించేందుకు వెళ్లారు. అందువల్ల 12 + 11 కలిపితే అర్జునుడి వయస్సు 23 అవుతుంది. గురుకులంలో విద్యనభ్యసించాక అర్జునుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు అతని వయస్సు అది.
ఇక పాండవులు ఏడాది తరువాత లక్క గృహానికి వెళ్లారు. అక్కడ మరో ఏడాది గడిపారు. అనంతరం ఆ గృహం కాలిపోతుంది. తరువాత వారు ఏడాదిపాటు అడవిలో గడిపారు. అదే సమయంలో ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. తరువాత ఏడాది గడిపారు. మొత్తం 4 ఏళ్లు అవుతుంది. దీంతో 23 + 4 = 27 అవుతుంది. ద్రౌపదిని వివాహం చేసుకున్నాక తన 27వ ఏట అర్జునుడు హస్తినాపురానికి వస్తాడు.
Advertisement
Advertisements
Advertisements
ఆ తరువాత పాండవులు ఇంద్రప్రస్థం నిర్మించుకుని అందులోనే ఉంటారు. ఆ తరువాత అర్జునుడు 12 ఏళ్ల పాటు అడవిలో గడుపుతాడు. మరో ఏడాదిపాటు అజ్ఞాతంలో ఉంటాడు. దీంతో 27 + 12 + 1 = 40 అవుతుంది. అదే సమయంలో అర్జునుడు కృష్ణుడి సోదరి సుభద్రను వివాహం చేసుకుంటాడు. సుభద్రకు 22 ఏళ్ల వయస్సులో అర్జునుడితో వివాహం జరుగుతుంది. ఆమె కన్నా కృష్ణుడు 17 ఏళ్లు పెద్ద. అందువల్ల సుభద్ర వివాహం జరిగినప్పుడు కృష్ణుడు, అర్జునుడికి దాదాపుగా ఒకే వయస్సు ఉంటుంది. కానీ కృష్ణుడు అర్జునుడి కన్నా 6 నెలలు పెద్ద.
ఇక పాండవుల 12 ఏళ్ల అరణ్య వాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం కలుపుకుని మొత్తం 13 అవుతుంది. తరువాత ఏడాది పాటు పాండవులు యుద్ధం కోసం రాజులందరితో సంప్రదింపులు జరుపుతారు. దీంతో అర్జునుడి వయస్సు 40 + 13 + 1 = 54 అవుతుంది. అయితే కురుక్షేత్ర యుద్ధం సమయంలో భీష్ముడి వయస్సు 119 ఏళ్లని చెప్పబడింది. భీష్ముడి కన్నా అర్జునుడు 64 ఏళ్లు చిన్నవాడు. అందువల్ల అప్పుడు అర్జునుడి వయస్సు 55 ఉంటుంది. అంటే కృష్ణుడి వయస్సు కూడా యుద్ధం సమయంలో అంతే ఉంటుంది. కానీ కృష్ణుడు అర్జునుడి కన్నా 6 నెలలు పెద్ద. ఇక కృష్ణుడు యుద్ధం తరువాత 36 ఏళ్లకు చనిపోయినట్లు చెప్పారు. అంటే కృష్ణుడు మరణించినప్పుడు అతనికి 91 ఏళ్లు వయస్సు ఉందన్నమాట.