Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

జీవ‌న‌భాష్యం SSC TELUGU FIRST LANGUAGE

Advertisement

9. జీవ‌న‌భాష్యం

జీవ‌న‌భాష్యం – డా. సి. నారాయ‌ణ రెడ్డి
క‌విప‌రిచ‌యం : సినారె రాజ‌న్న సిరిసిల్లా జిల్లా హ‌నుమాజీపేట‌లో జ‌న్మించారు. నాగార్జున సాగ‌రం, క‌ర్పేర వ‌సంత‌రాయ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంద‌హాసం, ప్ర‌పంచ ప‌దులు లాంటి 70కి పైగా కావ్యాలు రాశారు.

సినారె రాసిన విశ్వంభ‌ర కావ్యానికి జ్ఞాన‌పీఠ అవార్డ్ ల‌భించింది. తెలంగాణ నుండి ఈ అవార్డ్ అందుకున్న ఏకైక క‌వి సినారెనే! ఈయ‌న సాహిత్య సేవ‌కు గాను భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. అధికార‌భాషా సంఘం అధ్య‌క్షుడిగా,ఆంధ్ర సార‌స్వ‌త ప‌రిష‌త్తు అథ్య‌కుడిగా, రాజ్య‌స‌భా స‌భ్యుడిగా సినారె త‌న సేవ‌లందించారు.

పాఠం ఉద్దేశం : ఆటుపోట్ల‌ను అనుభ‌విస్తూ విజ‌యాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితో పాటు నిజ‌మైన గుర్తింపు ల‌భిస్తుందని చెప్ప‌డ‌మే ఈ పాఠం ఉద్దేశం.

గ‌జ‌ల్ ప్ర‌క్రియ : గ‌జ‌ల్ క‌వితా ప్ర‌క్రియ 10 వ శతాబ్దంలోఇరాన్ లో ప్రారంభ‌మైంది. మొఘ‌లుల కాలంలో ఇరాన్ నుండి ఇండియాకు వ‌చ్చింది. గజల్ అనే పదం గజాల అనే ట‌ర్కీ ప‌దం నుండి ఆవిర్భవించింది…దీన‌ర్థం ‘జింక’, ‘జింక కనులు గల’ అని.! ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ గ‌జ‌ల్.

గజల్‌లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. గజల్ చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ – గజల్ జీవగుణాలు.

Advertisements

పాఠ్యాంశం- వివ‌ర‌ణ‌:

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది

(నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అవి నీటి రూపంలో దర్శనమిస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు, దిగులుతో కూడిన మబ్బులు కమ్మితే కన్నీళ్లుగా బయటకు వస్తాయి)

వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది

( ఓ నేస్తమా ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు వంకల డొంకల లాంటి ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు జంకక, నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు వేస్తే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు నడిచే దారిగా మారుతుంది)

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

(ఎడారిలా బీడుపడి పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని, దున్నితే లాభం ఏమీ లేదనక, నిరాశపడక ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పైరు అవుతుంది)

మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది.

(మనుషులూ, మృగాలు ఒకటే అని అనుకోవడం వృథా. నలుగురు మనుషులు పరస్పరం కలిసి పరస్పర సహకారంతో జీవించాలి. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అలాంటి మనుషులు కలిస్తే ఒక ఊరు ఏర్పడుతుంది)

ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది

(ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత సామర్థ్యం ఉన్నా; అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించాల్సిందే. అది ఏరుగా మారాల్సిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరులా కారిపోవాల్సిందే)

Advertisement

బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి ”సినారే
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

(ప్రపంచానికి పేరు తెలిసేలా ఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపులేదు. ఎన్నటికి చెరిగిపోని త్యాగం చేస్తే గొప్ప పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది)

ప‌దాల వివ‌ర‌ణ‌:

  • మనసుకు మబ్బు ముసరడం: మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం
  • మనిషి-మృగం ఒక‌టేనా?: మ‌నిషిని మృగం నుండి వేరు చేసేది విచ‌క్ష‌ణా జ్ఞానం.
  • చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది: గొప్ప త్యాగాల‌ను చేసిన‌ప్పుడు మ‌న పేరు శాశ్వ‌తంగా నిలిచిపోతుంది.

జీవ‌న భాష్యం : భాష్యం అంటే నిర్వ‌చ‌నం…ఆద‌ర్శ‌, అభ్యుద‌య జీవితం ఎలా ఉండాలో ఈ పాఠంలో మ‌నం తెల్సుకోవొచ్చు.

ప‌ర్యాయ ప‌దాలు :

  • మ‌బ్బు : మేఘ‌ము, అంబుద‌ము, మొయిలు
  • గుండె : హృద‌య‌ము, డెంద‌ము
  • శిర‌సు : త‌ల‌, మ‌స్త‌క‌ము, మూర్ధ‌ము

సొంత వాక్యాలు :

  • వ్యాప్తి : కొరోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా వ్యాప్తి చెందింది
  • జంక‌ని అడుగులు : డాక్ట‌ర్ల జంక‌ని అడుగులే కొరోనా నుండి మ‌న‌ల్ని ర‌క్షిస్తున్నాయి
  • ఎడారిదిబ్బ‌లు : సౌదీ ఆరేబియాలో ఎటుచూసినా ఎడారిదిబ్బ‌లే ద‌ర్శ‌న‌మిస్తాయి
  • చెర‌గ‌ని త్యాగం : ఎంద‌రో వీరుల చెర‌గ‌ని త్యాగం కార‌ణంగానే ఇండియాకు స్వ‌తంత్రం వ‌చ్చింది.

సంధి :

  • నీరు + అవుతుంది = నీర‌వుతుంది ( ఉత్వసంధి)
  • ఎత్తుల‌కు + ఎదిగిన = ఎత్తుల‌కెదిగిన ( ఉత్వ‌సంధి)
  • పేరు+ అవుతుంది = పేర‌వుతుంది ( ఉత్వ‌సంధి )

ఉత్వ‌సంధి: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.
నీరు (ఉ) + (అ) అవుతుంది = నీర‌వుతుంది.

స‌మాసాలు:

  • ఎడారి దిబ్బ‌లు : ఎడారి(లో) దిబ్బ‌లు….. ష‌ష్ఠి త‌త్పురుష ( కి, కు,యొక్క‌, లో, లోప‌ల‌)
  • ఇసుక గుండెలు.…ఇసుక యొక్క గుండెలు…ష‌ష్ఠి త‌త్పురుష ( కి, కు,యొక్క‌, లో, లోప‌ల‌)

అలంకారాలు :
1) నీకు వంద వంద‌నాలు – ఛేకానుప్రాస అలంకారం.
ఛేకానుప్రాస అలంకారం : హ‌ల్లుల జంట అర్థ‌బేధంతో వెంటవెంట‌నే రావ‌డం.
ఇక్క‌డ వంద‌=100, వంద‌నాలు లో అంటే న‌మ‌స్కారాలు….. రెండు వంద‌లు ప‌క్క‌నే ప‌క్క‌నే వ‌చ్చాయి…వేరే వేరే అర్థాన్ని తెచ్చాయి. కాబ‌ట్టి ఛేకానుప్రాస అలంకారం.

2) తెలుగు జాతికి అభ్యుద‌యం, న‌వ భార‌తికే న‌వోద‌యం – అంత్యానుప్రాసాలంకారం
అంత్యానుప్రాసాలంకారం: పాదం చివ‌ర్లో ఒకే ఉచ్చార‌ణ‌తో ముగిసే ప‌దాలు….
అభ్యుద‌యం లో ద‌యం, న‌వోద‌యం లో ద‌యం……ఒకే ఉచ్చార‌ణ‌తో ముగుస్తున్నాయి.

3) రాజు రివాజులు బూజు ప‌ట్ట‌గ‌న్ – వృత్త్య‌నుప్రాసాలంకారం
వృత్త్య‌నుప్రాసాలంకారం: ఏదైనా ఒక అక్ష‌రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఆవృత్తి చెందితే దాన్ని వృత్త్య‌నుప్రాసాలంకారం అంటారు. పై వాక్యంలో జు అనే అక్ష‌రం( హ‌ల్లు ) పున‌రావృత్త‌మైంది.

Advertisements

4) అజ్ఞానంద‌కారం తొలిగితే మంచిది –  రూప‌కాలంకారం
రూప‌కాలంకారం :ఉప‌మాన ఉప‌మేయాల‌ను బేధం లేన‌ట్లు చెప్ప‌డం…పై వాక్యంలో అజ్ఞానం అనేది ఉప‌మేయం అంధ‌కారం అనేది ఉప‌మానం….ఈ రెండికి బేధం లేన‌ట్లు చెప్ప‌బ‌డింది.

భాగ్యోద‌యం SSC TELUGU FIRST LANGUAGE

6. భాగ్యోద‌యం

క‌వి ప‌రిచ‌యం:  కృష్ణ‌స్వామి ముదిరాజ్ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా, ర‌చ‌యిత‌గా, జ‌ర్న‌లిస్ట్ గా సుప‌రిచితుడు. ఈయ‌న‌ 1957 లో హైద్రాబాద్ న‌గ‌ర మేయ‌‌ర్ గా ‘మాస్ట‌ర్ ప్లాన్’ త‌యారు చేశారు. ‘ద‌క్క‌న్ స్టార్’ అనే ఆంగ్ల ప‌త్రిక‌ను స్థాపించాడు. హైద్రాబాద్ చ‌రిత్ర‌ను ఫోటోల రూపంలో తెలిపేలా ‘పిక్టోరియ‌ల్ హైద్రాబాద్’ అనే గ్రంథాన్ని  అందించాడు. భార‌త ప్ర‌భుత్వంచే భార‌త స్వాతంత్ర్యోద్య‌మ చ‌రిత్ర రాసే సంఘంలో ప్యాన‌ల్ స‌భ్యుడిగా నియమించ‌బ‌డ్డాడు.

1Q) మూఢ‌న‌మ్మ‌కాల‌ను తొల‌గించ‌డానికి ఏం చేయాలి?

A: శాస్త్రీయ‌త లేకుండా గుడ్డిగా న‌మ్మే ఆచారాల‌ను మూఢ‌న‌మ్మ‌కాలు అంటారు. ఇలా చేస్తే  మంచి జ‌రుగుతుంద‌నో,  పూర్వీకులు చెప్పార‌నో ఆ మూఢ‌న‌మ్మ‌కాలు త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతూనే వ‌స్తున్నాయి.

మూఢ‌నమ్మ‌కాల‌ను తొల‌గించాలంటే :

  • శాస్త్రీయ విద్య‌ను అందించాలి.
  • బాణ‌మ‌తి లాంటి మూఢ న‌మ్మ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి.
  • మానసిక వైద్య నిపుణుల చేత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాలి.
  • మ్యాజిక్ షోల‌ను ఏర్పాటు చేస్తూ ….భూత‌వైద్యులు చేసే మోసాల‌ను తెలిపేలా చేయాలి.
  • ప్ర‌జ‌ల‌ పేద‌రికాన్ని నిర్మూలించి వారిలో  వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొదించాలి.
  • మూఢ‌న‌మ్మ‌కాలకు  వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించాలి.

2Q) అస‌మాన‌త‌లు తొలిగి స‌మాన‌త్వం రావాలంటే ఏం జ‌ర‌గాలి.

A: కుల,మ‌త,లింగ‌, వ‌ర్గ‌, వ‌ర్ణాల కార‌ణంగా ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అని ప‌రిగ‌ణించ‌డ‌మే అస‌మాన‌త‌. ఇది తొల‌గాలంటే మ‌నుషులంతా స‌మాన‌మ‌నే భావ‌న రావాలి.  భార‌త రాజ్యాంగం ఇచ్చిన‌ ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఖ‌చ్చితంగా అమ‌ల‌య్యేలా చూడాలి. ఆణగారిన వ‌ర్గాల అభివృద్ది కోసం వారికి  విద్య‌, వైద్య స‌దుపాయాల‌ను ఉచితంగా అందించి వారిని ప్రోత్సాహించాలి. ఆర్థికంగా వారికి ప్ర‌భుత్వాలు అండగా ఉండాలి.

3Q) వ్య‌స‌నాల వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు క‌లుగుతాయి?

A: చెడ్డ అల‌వాట్ల‌నే వ్య‌సనం అనే అర్థంలో వాడుతున్నాం. చెడు అల‌వాట్ల కార‌ణంగా డ‌బ్బు, స‌మ‌యం వృథా అవుతాయి. ఆరోగ్యం పాడ‌వుతుంది. బంధువుల్లో, స్నేహితుల్లో  విలువ త‌గ్గుతుంది. స‌మాజం చిన్న‌చూపుతో చూస్తుంది. మ‌న‌మీద మ‌న‌కు నియంత్ర‌ణ ఉండ‌దు. కుటుంబంలో గొడ‌వ‌లు వ‌స్తాయి. ఈ చెడు అల‌వాట్లు మ‌న మ‌ర‌ణానికి కూడా దారితీయ‌వొచ్చు.

4Q)   భాగ్య‌రెడ్డి వ‌ర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని గురించి రాయండి.

A: త‌న జాతి జ‌నుల అభివృద్దికై జీవితాన్ని అంకితం చేసిన సంఘ‌సంస్క‌ర్త భాగ్య‌రెడ్డి వ‌ర్మ. ఈయ‌న 1888లో జ‌న్మించాడు. మ‌నుషుల్లో ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ కాద‌నే స‌త్యాన్ని తెలిపాడు. అంట‌రాని వ‌ర్గాల పేరుతో వారు వెనుక‌బ‌డ‌డానికి కార‌ణం చ‌దువులేక‌పోవ‌డ‌మే అని తెలిసేలా చేసి  ఆ వ‌ర్గాల వారిని చ‌దువుకునేలా ప్రోత్సాహించాడు. చ‌దువు వ‌ల్ల వారిలోని సాంఘీక దురాచారాలు పోయేలా చేశాడు.

భాగ్య రెడ్డి వ‌ర్మ చేసిన ప‌నుల్లో ముఖ్య‌మైన‌వి దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌ను రూపుమాప‌డం, ముర్లీ, వేశ్యా సాంప్ర‌దాయాల‌ను అడ్డుకోవ‌డం. మ‌ద్య‌పానం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను, మూఢ‌న‌మ్మ‌కాల వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదాల‌ను వివ‌రించి జ‌నాల్లో చైత‌న్యాన్ని తేవ‌డం.

జాతీయ‌, అంత‌ర్జాతీయ‌ స్థాయిలో 3348కి పైగా ఉపాన్యాసాల‌ను ఇచ్చిన భాగ్య‌రెడ్డి వ‌ర్మ త‌న ప్ర‌తీ ఉపన్యాసంలో అణ‌‌గారిన వ‌ర్గాలు ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావించారు. అంట‌రాని వ‌ర్గాల వారిని ఆది హిందువులుగా పేర్కొని వారి అభివృద్దికై పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల ఏర్పాటు చేయించారు. ఈయ‌న‌ కృషి కార‌ణంగానే భార‌త ప్ర‌భుత్వం 1931 జ‌నాభా లెక్క‌ల్లో అంట‌రాని వ‌ర్గాల‌ను ఆది హిందువులుగా న‌మోదు చేసింది.

భాషాంశాలు : 
I.  పర్యాయ ప‌దాలు :

  • అండ = ఆస‌రా, ఆధారం
  • ఉన్న‌తి = అభివృద్ధి, ప్ర‌గ‌తి
  • స్వేఛ్చ = స్వాతంత్ర్యం, స్వ‌తంత్ర‌త
  • వికాసం = అభివృద్ధి, ప్ర‌పుల్లం

II.  సొంత వాక్యాలు :

  • ఏక‌తాటి:  తెలంగాణ ప్ర‌జ‌లంతా ఏక‌తాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్నారు
  • మ‌చ్చుతున‌క :  హైద్రాబాద్ లోని అనేక క‌ట్ట‌డాలు న‌వాబుల వైభ‌వానికి మ‌చ్చుతున‌క‌లు
  • మ‌హ‌మ్మారి : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది.
  • నిరంత‌రం :  నిరంత‌ర ప్ర‌య‌త్నం మ‌న‌కు విజ‌యాన్నిస్తుంది.

వ్యాక‌ర‌ణాంశాలు : 


ప్ర‌త్య‌క్ష – ప‌రోక్ష క‌థ‌నాలు :

  • నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్ ( ప్ర‌త్య‌క్ష క‌థ‌నం )
  • తాను త‌న దేశాన్ని ప్రేమిస్తున్నాన‌ని శ్రీనివాస్ అన్నాడు ( ప‌రోక్ష క‌థ‌నం )

ప్ర‌త్య‌క్ష క‌థ‌నం లోకి రాసేట‌ప్పుడు

  • ఒక‌రు చెప్పిన మాట‌ల‌కు ఉద్ధ‌ర‌ణ చిహ్నాలు ( inverted commas) ఉంటాయి.
  • ప‌దాలు  ఉత్త‌మ పురుష ( నేను, మేము,నా ,మా )లో ఉంటాయి.

ప‌రోక్ష  క‌థ‌నం లోకి రాసేట‌ప్పుడు :

  • ఉద్ద‌ర‌ణ చిహ్నాలు ఉండ‌వు.
  • ప్ర‌థ‌మ పురుష ప‌దాలు ( తాను, తాము, త‌న‌,త‌మ‌) ఉంటాయి.

దాన‌శీలం – బ‌మ్మెర పోత‌న. 10th Class Telugu First Language

బ‌మ్మెర పోత‌న : పోత‌న 15వ శతాబ్దానికి చెందిన క‌వి. జ‌న‌గాం జిల్లా బమ్మెర నివాసి. ఈయ‌న భోగినీ దండ‌కం, వీర‌భ‌ద్ర విజ‌యం, నారాయ‌ణ శ‌త‌కం, ఆంధ్ర మ‌హాభాగ‌వ‌తాల‌ను రాశాడు. పోత‌న‌ స‌హ‌జ పండితుడని ప్ర‌సిద్ధి. పోత‌న త‌న భాగ‌వ‌తాన్ని శ్రీరాముడికి అంకిత‌మిచ్చాడు.

పోత‌న ర‌చ‌నా విధానం శ‌బ్ద అలంకారాల సొగ‌సుతో భ‌క్తిర‌స ప్ర‌ధానంగా సాగుతోంది. పోత‌న ర‌చ‌న‌లు పండిత పామ‌ర జ‌న‌రంజ‌కంగా ఉంటాయి.

దాన‌శీలం పాఠ్యాన్ని గ‌మ‌నిస్తే….
బ‌లిచ‌క్ర‌వ‌ర్తి, శుక్రాచార్య‌ల సంభాష‌ణ‌లో నాట‌కీయ‌త‌, ఈ కుబ్జుండు అల‌తింబోడు అన‌డంతో పొట్టివాళ్లు గ‌ట్టివాళ్లు అనే స‌హ‌జ‌భావం, ప‌లికి బొంక‌రాదు అంటూ చెప్పే అనేక నీతులు, విష‌యాన్ని క‌ళ్ల‌ముందు ఉంచుతున్న‌ట్లు న‌డిపే క‌థ‌నాల‌ను మ‌నకు క‌నిపిస్తాయి.

ప‌ద్యాలు – ప్ర‌తి ప‌దార్థాలు :

1.ప‌ద్యం: కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబుండు విశ్వంభరుం
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం; బనుపుమా వర్జిన్ వదాన్యోత్తమా !

ప్ర‌తి ప‌దార్థ0:

వ‌దాన్య + ఉత్త‌మా! ( వ‌దాన్యోత్త‌మా) = దాత‌ల్లో శ్రేష్ఠుడా ( ఓ బ‌లి చ‌క్ర‌వ‌ర్తి)
కుల‌మున్ = మీ వంశాన్ని
రాజ్యమున్ = మీ రాజ్యాన్ని
తేజ‌మున్ = మీ ప‌రాక్ర‌మాన్ని
నిలుపుము = కాపాడుము
ఈ కుబ్జుండు = ఈ పొట్టివాడు ( వామ‌నుడు )
విశ్వంభ‌రుండు = విశ్వ‌మును భ‌రింప‌గ‌ల్గు వాడు ( విష్ణు మూర్తి)
అల‌తిన్ + పోడు = అంత తేలిక‌గా పోడు
త్రివిక్ర‌మ స్పుర‌ణ‌వాడై = త్రివిక్ర‌ముడంత‌టి వాడై మూడు లోక‌ముల‌ను ఆక్ర‌మించ‌గ‌ల‌వాడై
బ్ర‌హ్మాండ‌మున్ = ఈ విశ్వాన్ని
నిండున్ = వ్యాపిస్తాడు
ఒకండు = ఎవ‌రైనా
మాన్ప‌న్ + క‌ల‌డే = త‌ప్పింప గ‌లుగుతాడా?
నా = నా యొక్క
ప‌లుకులు = మాట‌లు
క‌ర్ణంబుల‌న్ = చెవుల‌తో
ఆక‌ర్ణింపు = విను
దాన‌ము గీన‌ము = ఈ దానం
వ‌ల‌దు = వ‌ద్దు
వ‌ర్ణిన్ = ఈ బ్ర‌హ్మ‌చారిని
ప‌నుపుమా! = పంపించు

——————————————————————–

2. ప‌ద్యం: కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!

ప్ర‌తి ప‌దార్థ0:

భార్గ‌వా! = భృగువంశంలో పుట్టిన వాడా! ( ఓ శుక్రాచార్య‌)
రాజులు = ఎంతోమంది రాజులు
కారే = కాలేదా? ( అయ్యారు )
రాజ్య‌ముల్ = వారికి రాజ్యాలు
క‌లుగ‌వే = క‌లుగ‌లేదా? ( క‌లిగాయి)
గ‌ర్వ‌= పొగ‌రుతో
ఉన్న‌తిన్ = గొప్ప‌ద‌నాన్ని
పొంద‌రే = పొంద‌లేదా? ( పొందారు)
వారు = ఆ రాజులు
సిరి = సంప‌ద‌ను
మూట‌గ‌ట్టుకొని= మూట‌లుగా క‌ట్టుకొని
పొవ‌న్ + చాలిరే = వెళ్ళ‌గ‌లిగారా? ( వెళ్ళ‌లేక‌పోయారు )
భూమిపైన్ = ఈ భూమియందు
పేరైన‌న్ = వారి పేరైనా
క‌ల‌దే = ఉందా? ( లేదు)
శిభి ప్ర‌ముఖులున్ = శిభి లాంటి గొప్ప‌దారు
య‌శ కాములై = కీర్తిని కోరిన వారై
కోర్కులు = కోరిన వారి కోర్కెలను
ప్రీతిన్ = ప్రేమ‌తో
ఈరే = తీర్చ‌లేదా? ( తీర్చారు)
ఈ+ కాల‌మున్ = ఇప్ప‌టికీ
వార‌ల‌న్ = అటువంటి మ‌హాదాత‌ల‌ను
మ‌ర‌చిరే = మ‌రిచిపోయారా? ( మ‌రిచిపోలేదు)

—————————————————————–

3. ప‌ద్యం: నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

ప్ర‌తి ప‌దార్థ0:

ధీవ‌ర్య = బుద్దిమంతుల‌లో శ్రేష్ఠుడా! ( ఓ శుక్రాచార్య‌)
వినుమా= విను
నిర‌యంబు+ ఐన = న‌ర‌కం దాపురించినా
నిబంధ‌న‌ము + ఐన = అనేక క‌ష్టాలు వ‌చ్చినా
ధ‌రణీ = రాజ్యము
నిర్మూలనంబు+ఐన = నాశనమైనా
దుర్మరణంబు+ ఐన = చెడ్డ మ‌ర‌ణం సంభ‌వించినా
కులాంతము+ ఐన = వంశం నాశ‌న‌మైనా
నిజమున్ = నిజంగానే… పైన చెప్పిన‌వ‌న్నీ
రానిమ్ము = వ‌స్తే రానీ
కానిమ్ము పో = జరిగితే జ‌ర‌గ‌నీ
వేయి+ ఏటికిన్ = వేయి మాట‌లు ఎందుకు?
అభి+ అగ‌తుండు = అలా వ‌చ్చిన వాడు
హారుడు + ఐన‌న్ = శివుడు అయినా
హ‌రి + ఐన = విష్ణువు అయినా
నీర‌జ‌భ‌వుండు + ఐన = బ్ర‌హ్మ‌దేవుడే అయినా
నాదు జిహ్వా= నా నాలుక
ఔన్ = ఔన‌ని (ఇస్తాన‌ని)
తిరుగ‌న్ = తిరిగిపోవ‌డం ( మాట త‌ప్ప‌డం)
నేర‌దు = చేయలేదు.

నోట్ : ప్ర‌తి ప‌దార్థం రాసేట‌ప్పుడు సంబోధ‌న‌తో ప్రారంభించి క్రియ‌తో ముగించాలి.

———————————————————————-

1Q: ఈ కుబ్జుండు అల‌తింబోడు అని శుక్రాచార్యుడు చెప్ప‌డంలో అత‌ని ఉద్దేశ‌మేమై ఉంటుంది? దానితో మీరు ఏకీభ‌విస్తారా?

A: ఈ కుబ్జుండు అల‌తింబోడు అంటే …ఈ పొట్టివాడు కొంచెం మాత్ర‌మే తీసుకుపోయేవాడు కాదు అని అర్థం. ఈ మాట‌ల‌ను రాక్ష‌స గురువైన శుక్రాచార్యుడు రాక్ష‌స రాజైన బ‌లి చ‌క్ర‌వ‌ర్తితో చెప్పాడు. వామ‌నుడి రూపంలో వ‌చ్చిన‌ వాడు సాక్షాత్తు విష్ణుమూర్తని గ్ర‌హించిన శుక్రాచార్యుడు రాక్ష‌స వంశాన్ని కాపాడాల‌నే ఉద్దేశంతో ముందుగానే ఈ విధంగా బ‌లిని హెచ్చ‌రించాడు.

శుక్రాచార్యుడి మాట‌ల‌తో నేను ఏకీభ‌విస్తున్నాను. ఏ గురువైనా త‌న శిష్యుడి ఉన్న‌తినే కోరుకుంటాడు కానీ నాశనాన్ని కోరుకోడు. విష్ణుమూర్తియే వామ‌న‌రూపంలో వ‌చ్చాడని త‌న దివ్య‌దృష్టితో గ్ర‌హించిన శుక్రాచార్యుడు రాక్ష‌స వంశం నిలిచి ఉండాలంటే బ‌లి ఇచ్చిన మాట‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోర‌డం స‌రైన‌దే.

2Q : హ‌లికుడు ఎలాంటి వ‌స‌తి సౌక‌ర్యాలు ఉంటే తృప్తి చెందుతాడు?

A:హాలికుడు అంటే రైతు. రైతుకు సార‌వంత‌మైన నేల‌, నాణ్య‌మైన విత్త‌నాలు, స‌మయానుసారం వ‌ర్షం ఉంటే త‌న నేల‌లో బంగారం పండిస్తాడు. ప్ర‌స్తుత కాలంలో రైతుకు పెట్టుబ‌డి సాయం, స‌బ్సిడీపై ఎరువులు, పండిన పంట‌ను మార్కెట్ లో అమ్ముకునే వెసులు బాటు, గిట్టుబాటు ధ‌ర‌, పంట దిగుబ‌డికి వ్య‌వ‌సాయ శాస్త్ర‌జ్ఞులు ఇచ్చే సూచ‌న‌లు,పంట నిల్వ చేసుకునే గిడ్డంగుల ఏర్పాట్లు ఉంటే రైతు తృప్తి చెందుతాడు. అప్పుడు వ్య‌వ‌సాయం దండ‌గ కాకుండా పండుగ‌గా నిలుస్తుంది.

3Q: సిరి మూట‌గ‌ట్టుకొని పోవం జాలిరే అని బలి చ‌క్ర‌వ‌ర్తి అన‌డంతో ఆంతర్య‌మేమి?

A : సిరి మూట గట్టుకొని పోవం జాలిరే అని శుక్రాచార్యుడితో బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అన్నాడు. పూర్వం అనేక మంది రాజులు త‌మ త‌మ‌ రాజ్యాల‌ను పాలించారు. అనేక సంప‌ద‌లను కూడ‌బెట్టారు. వారెవ్వ‌రూ త‌మ‌తో పాటు తాము సంపాధించిన ఆస్తుల‌ను తీసుకెళ్ల‌లేదని చెబుతూ….. ప్రేమ‌తో దానం చేసిన శిభి చ‌క్ర‌వ‌ర్తి లాంటి వాళ్ల పేర్లే నిలిచున్నాయ‌ని…దానం చెయ్య‌డంలోని గొప్ప‌త‌నాన్ని తెలిపాడు. సంప‌ద‌లు ఆశాశ్వ‌త‌మ‌నే స‌త్యాన్ని తెలియ‌జేశాడు. అందుకే త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని తెలిసి కూడా వామ‌నుడు కోరిన మూడు అడుగుల నేల‌ను సంతోషంగా దాన‌మిచ్చాడు :

4Q :  ఆడిన మాట త‌ప్పకూడ‌దు ఎందుకు?

A : ఇచ్చిన మాట త‌ప్పితే మ‌న మీదున్న గౌర‌వం పోతుంది, మ‌న విలువ త‌గ్గుతుంది. మ‌నల్ని ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. ఇది మ‌న వ్య‌క్తిత్వం మీద చెడు ప్ర‌భావాన్ని చూపుతుంది. మ‌న‌తో స్నేహం చేయ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రారు, బంధువులు కూడా మన‌ల్ని నిర్ల‌క్ష్యం చేస్తారు. స‌మాజం కూడా మ‌న‌కు స‌రైన గుర్తింపునివ్వ‌దు. అందుకే ఎన్ని క‌ష్టాలొచ్చినా ఆడిన మాట త‌ప్ప‌కూడ‌దు.

——————————————————————-

5Q: ఆడిన మాట త‌ప్ప‌క‌పోవ‌డం, దాన‌గుణం పై నినాదాలు , సూక్తులు రాయండి.

ఆడినమాట త‌ప్ప‌క‌పోవ‌డం:

  • ఆడి త‌ప్ప‌కు- ప‌లికి బొంక‌కు
  • మాట నిల‌బెట్టుకో- నీతి నిరూపించుకో
  • చేసేదే చెప్పు – చెప్పిందే చేయి
  • ఒట్టేసి ఒక‌మాట‌, వేయ‌కుండా ఒక‌మాట వ‌ద్దు- ఎప్పుడూ ఒకే మాట ముద్దు
  • మాన‌ధ‌నులు మాట త‌ప్ప‌రు
  • ప్రాణం కంటే విలువైన‌ది మాట‌
  • మ‌నిషి చ‌చ్చినా మాట నిల్చును

దాన‌గుణం:

  • ర‌క్త‌దానం చేయండి- ప్రాణాలు కాపాడండి
  • అవ‌య‌వ దానం చేస్తే – మ‌ర‌ణం త‌ర్వాత కూడా జీవం ఉన్న‌ట్టే
  • విద్యాదానం చేయండి – వివేకాన్ని పెంచండి
  • అన్న‌దానం చేయండి – అన్నార్థుల ఆక‌లి తీర్చండి.
  • దానాన్ని మించిన త్యాగం లేదు

——————————————————————-

సొంత‌వాక్యాలు :

  • ప‌లికి లేద‌నుట ( మాట త‌ప్ప‌డం) : ప‌లికి లేదంటే మ‌న విలువ త‌గ్గుతుంది.
  • కుఱుచ‌గుట ( పొట్టిగ అవ్వ‌డం ) : పండుగ‌కు నేను కొన్న కొత్త బ‌ట్ట‌లు కుఱుచ‌య్యాయి.
  • చేతులొగ్గు ( యాచించడం ) : మాన‌ధ‌నులు ఎవ్వ‌రి ముందు చేతులొగ్గ‌రు.

వ్యుత్ప‌త్త్య‌ర్థాలు

  • నీర‌జ‌భ‌వుడు : నీటిలోని ప‌ద్మంలో పుట్టిన‌వాడు ( బ్ర‌హ్మ‌)
  • త్రివిక్ర‌ముడు : మూడ‌డుగుల‌చే ముల్లోకాల‌ను కొలిచిన‌వాడు ( విష్ణువు)

ప‌ర్యాయ ప‌దాలు

  • జ‌ల‌ము = నీరు, స‌లిలం, ఉద‌కం
  • య‌శ‌స్సు = కీర్తి, పేరు

ప్ర‌కృతి – వికృతులు

  • శ్రీ – సిరి
  • విష్ణువు – వెన్నుడు
  • ధ‌ర్మ‌ము – ద‌మ్మ‌ము
  • బ్ర‌హ్మ – బ‌మ్మ

నానార్థాలు :

  • కుల‌ము = వంశం, తెగ‌, ఇల్లు
  • క్షేత్ర‌ము = భూమి , శ‌రీరం, పుణ్య‌స్థ‌లం, భార్య
  • హ‌రి = విష్ణువు , సూర్యుడు, చంద్రుడు
  • చిత్ర‌ము = వింత‌, మ‌నోహ‌ర‌ము

—————————————————————————

సంధి ప‌దాలు :

  • అత్య‌ద్భుతం = అతి + అద్భుతం (య‌ణాదేశ సంధి)
  • గ‌ర్వోన్న‌తి = గ‌ర్వ + ఉన్న‌తి ( గుణ సంధి)
  • అభ్యాగ‌తులు = అభి+ ఆగ‌తులు ( య‌ణాదేశ సంధి)
  • వ‌దాన్యోత్త‌ముడు = వ‌దాన్య + ఉత్త‌ముడు (గుణ సంధి)
  • అణ్వాయుధాలు = అణు+ ఆయుధాలు ( య‌ణాదేశ సంధి)

విగ్ర‌హ వాక్యాలు – స‌మాసాలు

  • జీవ‌ధ‌న‌ములు – జీవ‌మును, ధ‌న‌మును – ద్వంద్వ స‌మాసం
  • యువ‌తయువ‌కులు – యువ‌తులును, యువ‌కులును- ద్వంద్వ స‌మాసం
  • ద‌శ దిక్కుడు – ద‌శ సంఖ్య‌గ‌ల దిక్కులు – ద్విగు స‌మాసం
  • భూత‌ప్రేత‌ముడు – భూత‌మును, ప్రేత‌మును-ద్వంద్వ స‌మాసం

ప‌ద్య పాదాల గ‌ణ విభ‌జ‌న:

1) తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా

୲ ୲ U -U ୲ ୲- U ୲ U- ୲ ୲ ୲- U U U- ୲ U U- ୲ U

తెలగా |ణమ్మున |గడ్డిపో |చయును |సంధించెన్ | కృపాణ |మ్మురా

స భ ర న మ య వ

ఈ పాదంలో స, భ, ర, న, మ, య, వ గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “మత్తేభ” పద్యపాదం.

లక్షణాలు:

  •  ప్రతి పాదంలో 20 అక్ష‌రాలుంటాయి.
  •  ప్రతి పాదంలోనూ “స, భ, ర, న, మ, య, వ” గణాలు క్రమంగా ఉంటాయి
  •  14 వ అక్షరం యతి స్థానం (తె – ధి)

2) అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టి యా

୲ ୲ ୲- ୲ U ୲- U ୲ ୲ -୲ U ୲ -୲ U ୲- ୲ U ୲- U ୲ U

అనయ |ముదోష |మేపరు |లయందు |కనుంగొ |నిపల్కు |నట్టి యా

న జ భ జ జ జ ర

ఈ పాదంలో “న, జ, భ, జ, జ, జ, ర” గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “చంపకమాల” పద్యపాదం.

లక్షణాలు:

  •  ప్రతి పాదంలో 21 అక్ష‌రాలుంటాయి.
  •  ప్రతి పాదంలోనూ “న, జ, భ, జ, జ, జ, ర” గణాలు క్రమంగా ఉంటాయి.
  • 11 వ అక్షరం యతి స్థానం (అ – య)

 

త్రిక సంధి : త్రికము ( ఆ, ఈ, ఏ) మీద ఉన్న అంస‌యుక్త హ‌ల్లు ద్విత్వంగా మారుతుంది.

  • అచ్చోట = ఆ+ చోట ( త్రిక సంధి)
  • ఇవ్విధ‌ము = ఈ + విధ‌ము ( త్రిక సంధి)
  • ఎక్కాల‌ము = ఏ+ కాల‌ము ( త్రిక సంధి)

10వ త‌ర‌గ‌తి సినారె “జీవ‌న‌భాష్యం” కంప్లీట్ స్ట‌డీ మెటీరియ‌ల్.!

జీవ‌న‌భాష్యం – డా. సి. నారాయ‌ణ రెడ్డి
క‌విప‌రిచ‌యం : సినారె రాజ‌న్న సిరిసిల్లా జిల్లా హ‌నుమాజీపేట‌లో జ‌న్మించారు. నాగార్జున సాగ‌రం, క‌ర్పేర వ‌సంత‌రాయ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంద‌హాసం, ప్ర‌పంచ ప‌దులు లాంటి 70కి పైగా కావ్యాలు రాశారు.

సినారె రాసిన విశ్వంభ‌ర కావ్యానికి జ్ఞాన‌పీఠ అవార్డ్ ల‌భించింది. తెలంగాణ నుండి ఈ అవార్డ్ అందుకున్న ఏకైక క‌వి సినారెనే! ఈయ‌న సాహిత్య సేవ‌కు గాను భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. అధికార‌భాషా సంఘం అధ్య‌క్షుడిగా,ఆంధ్ర సార‌స్వ‌త ప‌రిష‌త్తు అథ్య‌కుడిగా, రాజ్య‌స‌భా స‌భ్యుడిగా సినారె త‌న సేవ‌లందించారు.

పాఠం ఉద్దేశం : ఆటుపోట్ల‌ను అనుభ‌విస్తూ విజ‌యాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితో పాటు నిజ‌మైన గుర్తింపు ల‌భిస్తుందని చెప్ప‌డ‌మే ఈ పాఠం ఉద్దేశం.

గ‌జ‌ల్ ప్ర‌క్రియ : గ‌జ‌ల్ క‌వితా ప్ర‌క్రియ 10 వ శతాబ్దంలోఇరాన్ లో ప్రారంభ‌మైంది. మొఘ‌లుల కాలంలో ఇరాన్ నుండి ఇండియాకు వ‌చ్చింది. గజల్ అనే పదం గజాల అనే ట‌ర్కీ ప‌దం నుండి ఆవిర్భవించింది…దీన‌ర్థం ‘జింక’, ‘జింక కనులు గల’ అని.! ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ గ‌జ‌ల్.

గజల్‌లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. గజల్ చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ – గజల్ జీవగుణాలు.

పాఠ్యాంశం- వివ‌ర‌ణ‌:

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
(నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అవి నీటి రూపంలో దర్శనమిస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు, దిగులుతో కూడిన మబ్బులు కమ్మితే కన్నీళ్లుగా బయటకు వస్తాయి)

వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది
( ఓ నేస్తమా ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు వంకల డొంకల లాంటి ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు జంకక, నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు వేస్తే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు నడిచే దారిగా మారుతుంది)

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
(ఎడారిలా బీడుపడి పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని, దున్నితే లాభం ఏమీ లేదనక, నిరాశపడక ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పైరు అవుతుంది)

మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది.
(మనుషులూ, మృగాలు ఒకటే అని అనుకోవడం వృథా. నలుగురు మనుషులు పరస్పరం కలిసి పరస్పర సహకారంతో జీవించాలి. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అలాంటి మనుషులు కలిస్తే ఒక ఊరు ఏర్పడుతుంది)

ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
(ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత సామర్థ్యం ఉన్నా; అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించాల్సిందే. అది ఏరుగా మారాల్సిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరులా కారిపోవాల్సిందే)

బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి ”సినారే
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.
(ప్రపంచానికి పేరు తెలిసేలా ఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపులేదు. ఎన్నటికి చెరిగిపోని త్యాగం చేస్తే గొప్ప పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది)

ప‌దాల వివ‌ర‌ణ‌:

  • మనసుకు మబ్బు ముసరడం: మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం
  • మనిషి-మృగం ఒక‌టేనా?: మ‌నిషిని మృగం నుండి వేరు చేసేది విచ‌క్ష‌ణా జ్ఞానం.
  • చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది: గొప్ప త్యాగాల‌ను చేసిన‌ప్పుడు మ‌న పేరు శాశ్వ‌తంగా నిలిచిపోతుంది.

జీవ‌న భాష్యం : భాష్యం అంటే నిర్వ‌చ‌నం…ఆద‌ర్శ‌, అభ్యుద‌య జీవితం ఎలా ఉండాలో ఈ పాఠంలో మ‌నం తెల్సుకోవొచ్చు.

ప‌ర్యాయ ప‌దాలు :

  • మ‌బ్బు : మేఘ‌ము, అంబుద‌ము, మొయిలు
  • గుండె : హృద‌య‌ము, డెంద‌ము
  • శిర‌సు : త‌ల‌, మ‌స్త‌క‌ము, మూర్ధ‌ము

సొంత వాక్యాలు :

  • వ్యాప్తి : కొరోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా వ్యాప్తి చెందింది
  • జంక‌ని అడుగులు : డాక్ట‌ర్ల జంక‌ని అడుగులే కొరోనా నుండి మ‌న‌ల్ని ర‌క్షిస్తున్నాయి
  • ఎడారిదిబ్బ‌లు : సౌదీ ఆరేబియాలో ఎటుచూసినా ఎడారిదిబ్బ‌లే ద‌ర్శ‌న‌మిస్తాయి
  • చెర‌గ‌ని త్యాగం : ఎంద‌రో వీరుల చెర‌గ‌ని త్యాగం కార‌ణంగానే ఇండియాకు స్వ‌తంత్రం వ‌చ్చింది.

సంధి :

  • నీరు + అవుతుంది = నీర‌వుతుంది ( ఉత్వసంధి)
  • ఎత్తుల‌కు + ఎదిగిన = ఎత్తుల‌కెదిగిన ( ఉత్వ‌సంధి)
  • పేరు+ అవుతుంది = పేర‌వుతుంది ( ఉత్వ‌సంధి )

ఉత్వ‌సంధి: ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం.
నీరు (ఉ) + (అ) అవుతుంది = నీర‌వుతుంది.

స‌మాసాలు:

  • ఎడారి దిబ్బ‌లు : ఎడారి(లో) దిబ్బ‌లు….. ష‌ష్ఠి త‌త్పురుష ( కి, కు,యొక్క‌, లో, లోప‌ల‌)
  • ఇసుక గుండెలు.…ఇసుక యొక్క గుండెలు…ష‌ష్ఠి త‌త్పురుష ( కి, కు,యొక్క‌, లో, లోప‌ల‌)

అలంకారాలు :
1) నీకు వంద వంద‌నాలు – ఛేకానుప్రాస అలంకారం.
ఛేకానుప్రాస అలంకారం : హ‌ల్లుల జంట అర్థ‌బేధంతో వెంటవెంట‌నే రావ‌డం.
ఇక్క‌డ వంద‌=100, వంద‌నాలు లో అంటే న‌మ‌స్కారాలు….. రెండు వంద‌లు ప‌క్క‌నే ప‌క్క‌నే వ‌చ్చాయి…వేరే వేరే అర్థాన్ని తెచ్చాయి. కాబ‌ట్టి ఛేకానుప్రాస అలంకారం.

2) తెలుగు జాతికి అభ్యుద‌యం, న‌వ భార‌తికే న‌వోద‌యం – అంత్యానుప్రాసాలంకారం
అంత్యానుప్రాసాలంకారం: పాదం చివ‌ర్లో ఒకే ఉచ్చార‌ణ‌తో ముగిసే ప‌దాలు….
అభ్యుద‌యం లో ద‌యం, న‌వోద‌యం లో ద‌యం……ఒకే ఉచ్చార‌ణ‌తో ముగుస్తున్నాయి.

3) రాజు రివాజులు బూజు ప‌ట్ట‌గ‌న్ – వృత్త్య‌నుప్రాసాలంకారం
వృత్త్య‌నుప్రాసాలంకారం: ఏదైనా ఒక అక్ష‌రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఆవృత్తి చెందితే దాన్ని వృత్త్య‌నుప్రాసాలంకారం అంటారు. పై వాక్యంలో జు అనే అక్ష‌రం( హ‌ల్లు ) పున‌రావృత్త‌మైంది.

4) అజ్ఞానంద‌కారం తొలిగితే మంచిది –  రూప‌కాలంకారం
రూప‌కాలంకారం :ఉప‌మాన ఉప‌మేయాల‌ను బేధం లేన‌ట్లు చెప్ప‌డం…పై వాక్యంలో అజ్ఞానం అనేది ఉప‌మేయం అంధ‌కారం అనేది ఉప‌మానం….ఈ రెండికి బేధం లేన‌ట్లు చెప్ప‌బ‌డింది.

సినారె గ‌జ‌ల్స్ :

సినారె స్వ‌ద‌స్తూరితో రాసిన గ‌జ‌ల్స్ :

సినారె పుస్త‌కాల క‌వ‌ర్ ఫోటోస్ :

 

 

 

మీకు తెలుసా? అరుంధ‌తిలో జేజ‌మ్మా పాట రాసింది సినారేనే! :

సినారె గజల్స్ స్వ‌యంగా పాడిన‌వి:

SINARE FULL INTERVIEW:

సినారె క‌వితాగాన ల‌హ‌రి: 

సేక‌ర‌ణ :   అజారుద్దీన్ ( PGT- TELUGU-TMREIS)