Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

మూర్ఖులు – 8th Class Telugu Second Language

Advertisement

మూర్ఖులు

పాఠం ఉద్దేశం : అన‌వ‌స‌ర‌మైన ఆలోచ‌న‌ల‌తో , ప‌నుల‌తో స‌మ‌యాన్ని వృథా చేసుకోవొద్దు అని చెప్ప‌డ‌మే ఈ పాఠం ఉద్దేశం.

I) ప్ర‌శ్న‌- జ‌వాబులు :

1Q) మూర్ఖులు అని ఎవ‌రిని అంటారు?

A: క‌నీస ఆలోచ‌న శ‌క్తి, విచ‌క్ష‌ణా జ్ఞానం లేని వాళ్ల‌ను మూర్ఖులు అంటారు. వీరు అన‌వ‌స‌ర‌మైన ఆలోచ‌న‌లు, ప‌నుల‌తో త‌మ‌ స‌మ‌యాన్ని వృథా చేసుకుంటుంటారు.

2Q) స‌మ‌యం వృథా ఎందుకు చేయ‌కూడ‌దు?

Advertisements

A: కోట్లు పెట్టినా కొన‌లేని విలువైన వ‌స్తువు స‌మ‌యం.! గ‌డిచిన కాలం ఎప్ప‌టికీ తిరిగిరాదు. అందుకే స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా మ‌న‌కు, స‌మాజానికి ప‌నికి వ‌చ్చే ప‌నులు చేయాలి. విలువైన స‌మ‌యాన్ని వృథా చేసుకొని త‌ర్వాత బాధ‌ప‌డితే ఏమీ రాదు. అందుకే స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి.

3Q) మూర్ఖులు అనే క‌థ‌లో మంత్రి చేసిన ప‌ని స‌రైన‌దేనా? ఎందుకు?

A: మూర్ఖులు అనే క‌థ‌లో మంత్రి చేసిన ప‌ని స‌రైన‌దే. ఎందుకంటే రాజుకు రాజ్య పాల‌న ముఖ్యం. త‌న రాజ్యంలోని ప్ర‌జ‌ల బాగోగులు చూడ‌డం ముఖ్యం. అవ‌న్నీ వ‌దిలేసి త‌న రాజ్యంలోని మూర్ఖుల‌ను తీసుకు ర‌మ్మ‌ని మంత్రికి చెప్ప‌డం అన‌వ‌స‌ర ప‌ని. ఇక్కడ రాజు త‌న విలువైన స‌మ‌యాన్ని అన‌వ‌సర‌ ప‌నికోసం కేటాయించి త‌ప్పు చేశాడు. అవ‌స‌రం లేని ప‌ని చెప్పిన రాజును మూర్ఖుడిగా చూపించి మంత్రి ఆ త‌ప్పును ఎత్తిచూపి మంచి ప‌నిచేశాడు.

4Q) మూర్ఖులు క‌థ‌ను సొంత మాట‌ల్లో రాయండి.

A:  ఒక రాజుకు త‌న రాజ్యంలోని మూర్ఖుల వివ‌రాల గురించి తెల్సుకోవాల‌నిపించి ఆ ప‌నిని మంత్రికి అప్ప‌జెప్పాడు. చాలా రోజుల త‌ర్వాత మంత్రి రాజు ద‌గ్గ‌రికి వ‌చ్చి అయిదుగురు (5) మూర్ఖులు దొరికార‌ని ఒక్కొక్క‌రి గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.

Advertisement

తాను కూర్చున్న కొమ్మ‌ను తానే న‌రుక్కుంటున్న వ్య‌క్తిని 1వ మూర్ఖుడిగా, గుర్రంపై వెళుతూ గ‌డ్డిమోపును మోస్తున్న వ్యక్తిని 2వ మూర్ఖుడిగా ,చీక‌ట్లో పోయిన ఉంగరాన్ని వెలుతురున్న వేరే ప్ర‌దేశంలో వెతుకుతున్న వ్య‌క్తిని 3వ మూర్ఖుడిగా ప‌రిచ‌యం చేసి ఏమాత్రం ప్ర‌యోజ‌నంలేని ఈ ప‌నిని చెప్పిన రాజును 4వ మూర్ఖుడిగా, రాజు చెప్పిన ఆ పని కోసం 6 నెల‌ల కాలాన్ని వృథా చేసిన త‌న‌ను 5వ మూర్ఖుడిగా చెప్పి….. రాజు చేసిన త‌ప్పును రాజే తెలుసుకునేలా చేశాడు.

II)

1) గ‌డ్డిమోపును ఎవ‌రు మోస్తున్నారు?-  ( గ‌డ్డిమోపును రెండ‌వ వాడు మోస్తున్నాడు )

2) గుర్రం ఎట్లా ఉంది? – ( గుర్రం బ‌క్క‌చిక్కి ఉంది )

3) గుర్రం ఎవ‌రెవ‌రిని మోస్తుంది?- ( గుర్రం రెండ‌వ వాడిని, గ‌డ్డిమోపును మోస్తుంది)

4) పేరాలో రాజు ప‌లికిన మాట‌లు రాయండి-  ( నువ్వు?)

5) మంత్రి రెండో మూర్ఖుడితో ప‌లికిన మాట‌లు రాయండి- మంత్రి రెండో మూర్ఖుడితో ….. (“గ‌డ్డిమోపును గుర్రంపై పెట్ట‌వ‌చ్చు క‌దా” అన్నాడు.)

 

III ) అర్థాలు:

  • సంతోషం = ఆనందం
  • గ‌ద్దించ‌డం = మంద‌లించ‌డం, బెదిరించ‌డం
  • వృథా = దుబారా , వ్య‌ర్థం
  • నిర్భ‌యం = భ‌యం లేక‌పోవ‌డం

Advertisements

IV) సొంత వాక్యాలు :

  • స‌మ‌యం : స‌మ‌యం చాలా విలువైన‌ది
  • మూర్ఖులు : మూర్ఖులు మొండిగా వాదిస్తుంటారు.
  • బ‌క్క‌చిక్కిన : గ‌డ్డిలేక మా ఆవు బ‌క్క‌చిక్కింది.
  • స‌ల‌హాలు : ఏదైనా ప‌ని ప్రారంభించిన‌ప్పుడు పెద్ద‌ల స‌ల‌హాలు తీసుకోవాలి.

చ‌దువుదాం. 8th Class Telugu Second Language

1. చ‌దువుదాం

-Dr.దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు

____________________________________________________________________________________________

దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు :
దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు మ‌హ‌బూబాబాద్ జిల్లా చిన్న‌గుడూరులో జ‌న్మించారు. అగ్నిధార‌, రుద్ర‌వీణ పుస్త‌కాలతో పాటు అనేక సినిమా పాట‌లు రాశారు. ఈయ‌న ర‌చించిన తిమిరంతో స‌మ‌రం అనే ర‌చ‌న‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది.

ప్ర‌శ్న- జ‌వాబులు :
1Q: క‌రువు కాట‌కాలు లేక‌పోవ‌డం అంటే ఏమిటి?
A : క‌రువు కాట‌కాలు లేక‌పోవ‌డం అంటే ప్ర‌జ‌ల క‌నీస అవ‌ర‌సరాలైన తిండి, బ‌ట్ట, గూడు
(ఇళ్లు) ఉండ‌డ‌మే.

2Q: అహింసా మార్గంలో ఎందుకు న‌డ‌వాలి?
A : ఏ దేశ ప్ర‌జ‌లైనా శాంతియుత జీవ‌నాన్ని కోరుకుంటారు. శాంతిస్థాప‌న‌ కోసం అహింసా మార్గ‌మే ఉత్త‌మ‌మైన‌ది. ప్ర‌జ‌లంతా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండాలంటే గాంధీ చెప్పిన అహింసా మార్గంలో న‌డ‌వాలి.

3Q: చ‌దువుదాం గేయ సారాంశాన్ని సొంత మాట‌ల్లో రాయండి.
A :చ‌దువుదాం అనే గేయంలో క‌వి చ‌దువుకోవ‌డం వ‌ల్ల కలిగే లాభాల‌ను గురించి, అహింసా మార్గం గురించి తెలిపాడు. దేశ ఐక్య‌త కోసం మ‌నమంతా క‌లిసి శ‌త్రువుల‌ను ఎదిరించాలి, కుల మ‌త విబేధాలు లేకుండా మ‌న‌మంతా ఒక‌టే అనే భావ‌న ఉండాలి. గాంధీజీ చెప్పిన అహింసా మార్గంలో న‌డ‌వాలి. అప్పుడే దేశం ప్ర‌శాంతంగా ఉంటుంది.

సృజ‌నాత్మ‌క‌త :
పాఠం ఆధారంగా మంచి విష‌యాల‌ను సూక్తులుగా రాయండి.
1) అహింసే ప‌రమ‌ధ‌ర్మం
2) ఐక్య‌మ‌త్య‌మే మ‌హాబ‌లం
3) శోకం లేని లోకం కావాలి
4) ధైర్య‌మే ఆయుధం
5) చ‌దువే జ్ఞానం

ప‌ద‌జాలం
1) ర‌క్షించడం = కాపాడ‌డం
2) స‌మ‌ష్టి = క‌లిసి
3) శోకం = దు:ఖం
4) సాధ‌నాలు = ప‌రిక‌రాలు

సొంత వాక్యాలు :
1) ధైర్యం : ధైర్యంతో ఆప‌ద‌ల‌ను ఎదుర్కోవొచ్చు
2) శోకం : బాధ‌ల‌తో శోకించే వారిని ఆదుకోవాలి

Prepared By : 

Ambica Pallavi ( TGT- TELUGU ) 

TMRS- YAKUTPURA BOYS-2 

త్యాగ‌నిర‌తి ( 8వ త‌ర‌గ‌తి తెలుగు – ప్ర‌థ‌మ భాష‌)

1Q: న‌న్న‌య గురించి రాయండి.
 A: న‌న్న‌య 11వ శ‌తాబ్దానికి చెందిన క‌వి. ఈయ‌న‌ రాజ‌రాజ‌న‌రేంద్రుడి ఆస్థాన క‌వి. వ్యాస‌మ‌హ‌ర్షి సంస్కృతంలో రాసిన‌ మ‌హాభార‌తంలోని ఆది, స‌భా, అర‌ణ్య ప‌ర్వంలోని 4వ ఆశ్వాసం వ‌ర‌కు వ‌ర‌కు తెలుగులోకి అనువ‌దించాడు.

ప్ర‌స‌న్న క‌థాక‌లితార్థ‌యుక్తి, అక్ష‌ర ర‌మ్య‌త‌, నానారుచిరార్థసూక్తి నిధిత్వం అనేవి నన్న‌య ప‌ద్య ల‌క్ష‌ణాలు. ఇత‌నికి వాగానుశాస‌నుడు అనే బిరుదు క‌ల‌దు.

—————————————————————————

II. కింది ప‌ద్యాల‌కు భావాలు రాయండి.
ప‌ద్యం :
ధర్మజ్ఞులైన పురుషులు
ధర్మవునకు బాధసేయు ధర్మవునైనన్
ధర్మనుగా మదిదలపరు
ధర్మను సర్వంబునకు హితంబుగ వలయున్.

భావం : ధ‌ర్మం తెలిసిన‌వారు ధ‌ర్మానికి కీడు చేసే ఎటువంటి ధ‌ర్మాన్నైన ధ‌ర్మ‌మ‌ని మ‌న‌సులో త‌లుచుకోరు. ధ‌ర్మం అనేది అన్నింటికీ మేలు క‌లిగించేదిగానే ఉండాలి.

____________________________________________________________________________

ప‌ద్యం : ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె; నాశ్రితు నెట్టి యధముఁ డయిన
విడువఁ డనినను నే నెట్లు విడుతు దీని?
నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ

భావం :

ప్రాణ‌భ‌యంతో వ‌చ్చి ఈ పావురం న‌న్ను ఆశ్ర‌యించింది. ఎంత‌టి నీచుడైనా…ర‌క్షించ‌మ‌ని వ‌చ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్ట‌డు. నెనెట్లా విడిచిపెడ‌తాను? ఆశ్రితుల‌ను విడిచిపెట్ట‌డం ధ‌ర్మం ఎలా అవుతుందో నువ్వే చెప్పు.

_______________________________________________________________________________

 

ప్రాజెక్ట్ వ‌ర్క్

త్యాగం గురించిన మ‌రిన్న విష‌యాలు సేక‌రించి రాయండి

–