Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

మాతా హ‌రి ఎవ‌రు ? ఆమెకు ఎందుకు ఉరిశిక్ష విధించారు ?

Advertisement

మాతా హ‌రి అస‌లు పేరు మార్గ‌రెటా జెల్లె. ఆమెకు మాతా హ‌రి అనే పేరు వ‌చ్చింది. ఆమె ఒక స్టేజ్ డ్యాన్స్‌. స్ట్రిప్ప‌ర్‌. గూఢ చారి కూడా. ఆమె స్టేజిల‌పై ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేది. మాతా హ‌రి అనేది ఆమె స్టేజి పేరు. అయితే ఆమె నెద‌ర్లాండ్స్‌కు చెందిన యువ‌తి. కానీ మొద‌టి ప్ర‌పంచ యుద్ధం ముందు ఆమె జ‌ర్మ‌నీ వారి కోసం గూఢ‌చారిగా ప‌నిచేసేది.

mata hari feture image

 

మొద‌టి ప్ర‌పంచ యుద్ధానికి ముందు ఆమె అప్ప‌ట్లో అత్యంత ధనికులు, శ‌క్తివంతులు అయిన మ‌గ‌వారితో గ‌డిపేది. 1918లో ఫ్రెంచ్ వారు ఆమెపై గూఢచ‌ర్యం ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో జ‌ర్మ‌నీ కోసం ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆమె నేరం చేసిన‌ట్లు నిరూపించారు కూడా. దీంతో ఆమెకు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించి అమ‌లు చేశారు.

Advertisement

మాతా హ‌రి నిజానికి ఒక కిండ‌ర్ గార్టెన్ టీచ‌ర్‌. 1895లో ఆమెకు 19 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ఆమె కెప్టెన్ రుడాల్ఫ్ మెక్‌లియాడ్‌ను వివాహం చేసుకుంది. 1905లో ప్యారిస్‌లో రాత్రికి రాత్రే ఎగ్జాటిక్ డ్యాన్స‌ర్‌గా మారింది. ఆమె త‌న డ్యాన్స్‌తో ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేసేది. అయితే 1906లో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింది.

Advertisements

Advertisements

1914 నుంచి 1918 మ‌ధ్య కాలంలో ఆమె అనేక యూర‌ప్ దేశాల్లో ప‌ర్య‌టించింది. ఆమె చ‌ర్య‌లు అనుమానాస్ప‌దంగా అనిపించాయి. ఒక ద‌శ‌లో ఆమె ఫ్రెంచ్ గూఢ‌చారి కావ‌చ్చున‌ని అనుమానించారు. త‌రువాత 1917లో ఆమె జ‌ర్మ‌నీ గూఢ‌చారి అని తేలింది. ఆమెకు జ‌ర్మ‌నీ సైన్యంలో హెచ్‌-21 అనే కోడ్ నేమ్ కూడా ఇచ్చారు. త‌రువాత ఆమెను అరెస్టు చేసి సెయింట్ లజారె జైలులో ఉంచారు. అనంత‌రం ఆమె చేసిన నేరాలు నిర్దార‌ణ కావ‌డంతో ఆమెకు మ‌ర‌ణ‌శిక్ష విధించి అమ‌లు ప‌రిచారు. ఆమె మ‌ర‌ణానంత‌రం ఆమె మృత‌దేహాన్ని మెడిక‌ల్ రీసెర్చికి వాడారు.

 

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, మ‌హ‌మ్మ‌ద్ అలీ జిన్నా సోద‌రులా..?

పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ 1889 నవంబ‌ర్ 14న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ (ప్ర‌యాగ్‌రాజ్‌)లో మిర్ గంజ్‌లో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి మోతీలాల్ నెహ్రూ స్థానిక కోర్టులో లాయ‌ర్‌గా ప‌నిచేసేవారు. అయితే 1970ల‌లో ఆ ఏరియాలో కూల్చివేత‌లు చేప‌ట్టారు. త‌రువాత అది రెడ్ లైట్ ఏరియాగా మారింది.

మ‌హ‌మ్మ‌ద్ అలీ జిన్నా 1876 డిసెంబ‌ర్ 25న సింధ్‌లోని క‌రాచీలో ఉన్న వ‌జిర్ మంజిల్‌లో జ‌న్మించాడు. అత‌ని తండ్రికి అప్ప‌ట్లో గొప్ప వ్యాపారిగా పేరుండేది. బ్రిటిష్ మ‌ర్చంట్ కంపెనీ గ్రామ్స్ ట్రేడింగ్‌తో జిన్నా తండ్రి పార్ట్‌న‌ర్‌షిప్‌లో వ్యాపారం చేసేవాడు.

మోతీలాల్ నెహ్రూకు స్వ‌రూప రాణి రెండో భార్య‌. ఆమె క‌శ్మీరీ పండిట్‌. ఆమెకు జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌న్మించాడు. ఎంఏ జిన్నా.. మీఠీబాయి, పూంజాభాయ్ జిన్నాల‌కు జ‌న్మించాడు. నెహ్రూ త‌న చిన్న‌త‌నంలో అల‌హాబాద్‌లోని 9 ఎల్గిన్ రోడ్‌, సివిల్ లైన్స్‌తోపాటు ఆనంద్ భ‌వ‌న్ (ఒక‌ప్పుడు మ‌హ‌మ్మ‌ద్ మంజిల్) లో గ‌డిపాడు. అయితే ఇప్పుడ‌ది స్వ‌రాజ్ భ‌వ‌న్‌గా మారింది.

జిన్నా అప్ప‌ట్లో వ‌జిర్ మంజిల్‌లో 16 ఏళ్ల పాటు గ‌డిపి త‌రువాత ఉన్న‌త చ‌దువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాడు.

ఇక నెహ్రూ క‌న్నా జిన్నా 13 ఏళ్లు పెద్ద‌. అయితే ఇద్ద‌రూ అప్ప‌ట్లో ప్రొఫెష‌న‌ల్ రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేశారు. కానీ ఇద్దరూ సోద‌రులు అయితే కాదు. ఇద్ద‌రూ భిన్న ల‌క్ష‌ణాలు క‌లిగిన వ్య‌క్తులు. అనేక సార్లు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కానీ వారి మ‌ధ్య సోద‌ర సంబంధం లేదు.

 

ఈ చిన్న మిస్టేక్ చేయ‌కండి! ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడండి!

పాల ప్యాకెట్లు, వాట‌ర్ ప్యాకెట్లు, మ‌జ్జిగ ప్యాకెట్లు…. ప్యాకెట్స్ ఏవైనా చాలా మంది ఒకే విధంగా వాడుతారు…అదెలాగంటే…కార్న‌ర్ ను చించేసి లేదా క‌త్తిరించి….దీని కార‌ణంగా ఆ క‌ట్ చేసిన కార్న‌ర్ ప‌ర్యావ‌ర‌ణాన్ని పాడు చేస్తుంది!

అదెలాగంటే….సాధార‌ణంగా పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లను లో ” పాలీ ఇథైలిన్ ” అనే ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.దీనివల్ల వాటిని రీసైక్లింగ్ చేయ‌డానికి వీలు అవుతుంది. ఈ ప్యాకెట్లు పెద్ద‌విగా ఉంటాయి కాబ‌ట్టి…వాటిని సేక‌రించి రీ సైక్లింగ్ చేయొచ్చు… కానీ క‌ట్ చేసిన కార్న‌ర్స్ ను సేక‌రించ‌డం క‌ష్టం…అవి రీసైక్లింగ్ కాక‌, డీకంపోజ్ కాక….అలాగే ఉండిపోయి….ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యానికి దారి తీస్తున్నాయి.!

ఒక్క బెంగుళూరు లోనే రోజుకు 30 ల‌క్ష‌ల‌కు పైగా ఈ పీసులు చెత్త‌బుట్ట‌లోకి వెళుతున్నాయ‌ట‌…అలా లెక్కేసుకుంటూ పోతే…మ‌నం చేసే చిన్న‌పొరపాటు కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఎంత ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు ప‌నికిరాకుండా పోతుందో ఊహించండి!

ఏంచేయాలి?
ఈ ప్యాకెట్స్ ను క‌ట్ చేసేట‌ప్పుడు…కార్నర్ ను పూర్తిగా కాకుండా ప్యాకెట్ తో క‌లిసి ఉండేలా మాత్ర‌మే క‌ట్ చేయాలి…దీని వ‌ల్ల ఆ కార్న‌ర్ పీస్ వేరు కాకుండా పెద్ద ప్యాకెట్ తో ఉండ‌డం వ‌ల్ల వాటిని సేక‌రించ‌డం రీసైక్లింగ్ చేయ‌డం సుల‌భం అవుతుంది. ప్ర‌తి ఇంట్లో ఇలా చేస్తే సంవ‌త్స‌రానికి 5000 ప్లాస్లిక్ పీసులు వాతావ‌ర‌ణంలో క‌ల‌ప‌కుండా ఆప‌గ‌లిగిన వాళ్ల‌మౌతాం!

స్పెయ‌న్ దేశ‌స్తుల‌కు రెండు ఇంటి పేర్లుంటాయ్….ఒక‌టి తండ్రిది, ఇంకోటి తల్లిది! ఇంకా స్పెయిన్ గురించి మీకు తెలియ‌ని 7 ప్యాక్ట్స్!

ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు స్పెయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఎందుకంటే ఫుట్ బాల్ కు సంబంధించిన రిచెస్ట్ లీగ్ ‘ లా లిగా ‘ ప్రతి ఏడాది ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతుంది.మరి అలాంటి స్పెయిన్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం

1.స్పెయిన్ లో ‘ లా టోమోటీనా ‘ అనే ఫెస్టివల్ ను జరుపుతుంటారు.ఇందులో ఒకరి మీద ఒకరు టమోటాస్ విసురుతుంటారు.ఈ పండగ కోసం స్పెయిన్ లో ఏటా 1,50,000 టమోటాలను పండిస్తారు.

2.స్పెయిన్ నేషనల్  జాతీయ గీతంలో  ఒక ప‌దం కూడా ఉండదు.

3.ప్రపంచంలో అతి ఎక్కువ డైవర్స్ కేసులు నమోదయ్యే దేశాలలో స్పెయిన్ రెండవ స్థానంలో ఉంది.

4.ప్రపంచంలో ఆలివ్ ఆయిల్  ఎక్కువగా  ఉత్ప‌త్తి చేసే దేశాలలో స్పెయిన్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి 44శాతం ఆలివ్ ఆయిల్ ను స్పెయిన్ ఉత్ప‌త్తి చేస్తుంది.

5.స్పెయిన్ లో రెండు సర్ నేమ్స్ ఉంటాయి.మొదటిది తండ్రి సర్ నేమ్ కాగా రెండవది తల్లి సర్ నేమ్.

 

6.స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ ప్రపంచంలోని మోస్ట్ ఫ్రెండ్లీ ప్లేసెస్ లో ఒకటిగా గుర్తింపు సంపాదించింది.

7.ప్రపంచంలోనే అతి పురాతనమైన లైట్ హౌస్ స్పెయిన్ లో ఉంది.దీన్ని టవర్ ఆఫ్ హెర్క్యులస్ గా పిలుస్తుంటారు.మొదట శతాబ్దానికి చెందిన ఈ లైట్ హౌస్ ఇప్పటికీ ఆపరేషన్ లో ఉంది.

మ‌న‌లాగ అన్నాన్ని ప్ర‌ధాన‌ ఆహారంగా తీసుకునే 10 దేశాలు!? ఆ మాట‌కొస్తే మ‌నది సెకెండ్ ప్లేస్!?

ప‌ది చ‌పాతీలు తిన్నా…బుక్కెడు అన్నం తింటేనే క‌డుపు నిండిన‌ట్టు ఉంటుంది! అది మ‌న అల‌వాటు.! మూడుపూట‌లు వ‌రి అన్నాన్ని పుష్టుగా లాగించి ఎంతైనా క‌ష్టింతే త‌త్వం మ‌న‌ది! మ‌న‌లాగే అన్నాన్నే ప్ర‌ధానంగా తినే దేశాలు ఇంకొన్ని ఉన్నాయి…అవేంటో …సంవ‌త్స‌రానికి ఆ దేశాలు ఎంత బియ్యాన్ని తినేస్తున్నాయో ఓ సారి చూద్దాం!

1) చైనా – వినియోగించే బియ్యం-142,930 మెట్రిక్ టన్నులు

2) ఇండియా – వినియోగించే బియ్యం- 102,500 మెట్రిక్ టన్నులు

3) ఇండోనేషియా- వినియోగించే బియ్యం-37,700 మెట్రిక్ టన్నులు

4) బంగ్లాదేశ్ – వినియోగించే బియ్యం- 35,800 మెట్రిక్ టన్నులు

 

5) వియత్నం- వినియోగించే బియ్యం- 21,500 మెట్రిక్ టన్నులు

6) ఫిలిప్పీన్స్-వినియోగించే బియ్యం- 14,400 మెట్రిక్ టన్నులు

 

7) థాయిలాండ్-వినియోగించే బియ్యం- 11,700

8) బర్మా -వినియోగించే బియ్యం-10,550 మెట్రిక్ టన్నులు

9) జపాన్- వినియోగించే బియ్యం- 8,400 మెట్రిక్ టన్నులు

10)బ్రెజిల్-వినియోగించే బియ్యం- 7,500 మెట్రిక్ టన్నులు

సుశాంత్ చేతి గీత‌లు…..అత‌ని మ‌ర‌ణం గురించి ఏం చెబుతున్నాయి!?

హస్త సాముద్రికం.. చేతి రేఖలను బట్టి భవిష్యత్ ని చెప్పగలగడం..మనదేశంలో జాతకాలు, హస్తసాముద్రికానికి విశిష్ట ఖ్యాతి ఉంది..కొందరు ఇవన్ని మూఢనమ్మకాలు అని కొట్టిపారేసినప్పటికి.. గొప్పగొప్పవాళ్లు కూడా వీటిని నమ్ముతూ ఉంటారు.. ప్రస్తుతం సుశాంత్ చేతిరేఖల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..

మొదటి నుండి సుశాంత్ మరణానికి అతని ప్రియురాలు రియానే కారణం అనే వార్తలు వస్తున్నాయి..వాటిని బలపరుస్తూ రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది.. తాజాగా సుశాంత్ చేతిరేఖలు కూడా తను ఆత్మహత్య ద్వారా మరణించలేదని.. మ ర్డర్ చేయబడ్డాడని చెప్తున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. సుశాంత్ కుడి చేతిపై ఉన్న రేఖల్లో హార్ట్ లైన్,హెడ్ లైన్, లైఫ్ లైన్ మూడు కూడా కలిసిపోయి ఉన్నాయి..ఈ విధంగా కలిసిపోయి ఉంటే ఆ వ్యక్తి హత్యకి గురవుతాడిని చిరాలజి(హస్తసాముద్రిక శాస్త్రం) చెప్తుందట..

సుశాంత్ మరణించి రెండు నెలలు కావస్తోంది…యువనటుడు డిప్రెషన్తో బాధపడి సూ_సైడ్ చేస్కున్నాడనే వార్త తెలియగానే అనేకమంది షాక్ కి గురయ్యారు..తను అంత పిరికివాడు కాదని, డిప్రెషన్ లాంటిది ఏం లేదని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్తుంటే..డిప్రెషన్ కారణంగా మరణించాడనే ముంబయ్ పోలీసులు కేస్ క్లోజ్ చేయబోయారు.. ఎట్టకేలకు కుటుంబసభ్యుల అభ్యర్దన ,అభిమానుల డిమాండ్ తో సిబిఐని కేస్ టేకప్ చేయాల్సింది ఆదేశాలిచ్చింది సుప్రిం..సిబిఐ ఏం తేలుస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఘ‌న‌త గొప్ప‌దే కానీ …. వాళ్ల ప‌రిస్థితి గురించి ఫేక్ న్యూస్ ను వైర‌ల్ చేశారు.!

“తన తండ్రి ఎక్కడైతే సైకిల్ తొక్కి కష్టపడి తనని చదివించాడో..అదే ప్రాంతంలో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తూ తండ్రిని తలెత్తుకునేలా చేసింది ఓ కూతురు” అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరలవుతోంది.. ఫోటోలో ఉన్న వ్యక్తి నిజమే,తను ఎస్ఐ అనే మాట కూడా నిజమే..మరి నిజం కానిది ఏంటి అంటే…నెట్టింట్లో వైరలవుతున్నట్టు తన తండ్రి రిక్షావాడు కాదు ..ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి  ఎవరు?

ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి  పేరు ప్రియాంక నేగి..హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ లో SI  గా విధులు నిర్వహిస్తోంది.. ఇంటర్నేషనల్ కబడ్డి ప్లేయర్. హిమాచల్ ప్రదేళ్ మహిళల కబడ్డి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తుంది..2018లో ఆసియా క్రీడలలో రజతపతకం సాధించిన జట్టులో కూడా ప్రియాంక ఉంది.. హిమాచల్ ప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా అందించే పరశురామ్ అవార్డు గ్రహీత..కబడ్డి ప్లేయర్ గా ఎన్నోసార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది..ఆ వార్తల్లో ఎక్కడా కూడా ప్రియాంక తండ్రి ఒక సాధారణ రిక్షా నడుపుకునే వ్యక్తి,తనది అత్యంత పేద కుటుంబం అని పేర్కొనలేదు..మరి ఈ ఫోటో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది.

PRIYANKA NEGI (1)

ప్రియాంక నేగి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..ఎప్పటికప్పుడు తన ఫోటోస్ ని, అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రెండు నెలల క్రితం ప్రియాంక తన ఎఫ్బీ అకౌంట్లో పెట్టిన ఫోటోలను “ఐఏఎస్ తైయారి” అనే ఎఫ్బీ ఫేజ్ కాపీ చేసి.. ఈ కథ అల్లి పోస్ట్ చేసింది.. శేర్ చేసిన గంటలో వెయ్యికి పైగా లైకులు, శేర్లు.. సోషల్ మీడియాలో తన ఫోటోతో వైరలవుతున్న కథ ప్రియాంక వరకు చేరింది..

సోషల్ మీడియలో వైరలవుతున్న వార్తల్లో  నిజం లేదని తనది హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ , నేను పనిచేస్తున్న ప్లేస్ కి 200కిమి దూరం ఉంటుంది..పోస్టులో ఉన్నట్టుగా  మా నాన్న రిక్షావాడు కాదు,మాకంటూ కొన్ని ఆస్తులు ఉన్నాయి. అలాంటి స్టోరీలు రాయొద్దు అంటూ ప్రియాంక స్వయంగా చెప్పింది..అప్పటికే వేల సంఖ్యలో శేర్ అయిన న్యూస్ ప్రియాంక మాటలు వినేలా లేరు.. కనీసం ఇకపై మీ వరకు ఆ న్యూస్ వస్తే గుడ్డిగా ఫార్వర్డ్ చేయకుండా ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టండి.