Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ప్రపంచంలో 14 మంది పిల్లలకే ఉన్న అరుదైన వ్యాధి, లక్షణాలు ఏంటీ…?

Advertisement

బెంటా వ్యాధి” ఈ పేరు ఎప్పుడైనా విన్నారా…? మనకు తెలియని అసలు ఏ మాత్రం పరిచయం లేని వ్యాధి అది. అలాంటి వ్యాధులు ప్రపంచంలో చాలానే ఉన్నా సరే ఈ వ్యాధి మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే. ఈ వ్యాధితో బాధపడేది కేవలం 14 మంది పిల్లలు మాత్రమే. అందులో బెంగళూరుకు చెందిన ఏడు నెలల పాప కూడా ఉండటం ఇప్పుడు ఇండియాలో షాకింగ్ న్యూస్. నిజానికి ఈ వ్యాధి చాలా అరుదైనది. ప్రాధమిక రోగనిరోధక శక్తి లోపంతో మాత్రమే ఈ వ్యాధి వస్తుంది.

ఆ చిన్నారి పేరు విజయద్ర. వయసు, తీవ్రత పరంగా ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించారు వైద్యులు. బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారానే పసిబిడ్డ విజయద్ర ప్రాణాలను కాపాడగలమని DKMS BMST ఫౌండేషన్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. బెంగళూరుకు చెందిన బ్లడ్ స్టెమ్ సెల్ రిజిస్ట్రీ బిడ్డకు సరిపోయే దాత కోసం వెతుకుతుంది.ఇండియాలో కేవలం 0.04 శాతం మంది మాత్రమే ఆమెకు అవసరమైన బ్లడ్ దానం చేసేందుకు నమోదు చేయించారు.

Advertisement

ముఖ్యంగా రక్తపు మూలకణ దానం గురించి ప్రజలకు అవగాహన చాలా తక్కువ. బెంటా అనే తీవ్రమైన మరియు అరుదైన వ్యాధి NF-κB మరియు T-సెల్ ఎనర్జీతో B-కణ విస్తరణను సూచిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. B-సెల్ అనేది ఎముక మజ్జ నుండి వచ్చే ఒక రకమైన రోగనిరోధక కణం. ఈ వ్యాధి సమయంలో సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. NF-κB అనేది జన్యు వ్యక్తీకరణలో పాల్గొన్న ప్రోటీన్ కాంప్లెక్స్ లేదా నిర్దిష్ట జన్యువులు ఆన్ లేదా ఆఫ్ చేయబడే స్థాయిగా వైద్యులు వివరించారు.

Advertisements

Advertisements

T-సెల్ అనేది థైమస్‌లో పరిపక్వం చెందే ఒక రకమైన రోగనిరోధక కణమట. రొమ్ము ఎముక కింద ఛాతీ ఎగువ భాగంలో ఉన్న ఒక చిన్న అవయవం. బెంటా అనే వ్యాధి బాల్యంలో ప్రారంభమయ్యే కొన్ని రోగనిరోధక కణాల అధిక స్థాయిల ఆధారంగా గుర్తిస్తారు. ఇందులో విస్తరించిన ప్లీహము, విస్తారిత శోషరస కణుపులు, ఇమ్యునో డిఫిషియెన్సీ మరియు లింఫోమా తో ఒక రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా. ప్రధాన లక్షణాలు చూస్తే… ప్లీహము పెరుగుదల (స్ప్లెనోమెగాలియా) అలాగే చిన్న వయసులో తరచుగా చెవి, సైనస్ మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరుగుతాయి. దీనితో ఇప్పుడు ఆ చిన్నారికి చికిత్స చేయడం సవాల్ గా మారింది.

వారంలో 5-7 కేజీల బ‌రువు త‌గ్గించే GM డైట్ ప్లాన్!

జ‌న‌ర‌ల్ మోటార్స్ లో ప‌నిచేసే ఉద్యోగులు రూపొందించారు కాబ‌ట్టి ఈ డైట్ ప్లాన్ కు GM డైట్ ప్లాన్ అని పేరు వ‌చ్చింది. ఈ డైట్ వ‌ల్ల వారంలో 5-7కేజీల బ‌రువు త‌గ్గొచ్చు.

డే 1: ఫ్ర్యూట్ డైట్… మొద‌టి రోజు అర‌టి పండును త‌ప్పించి మీ ఇష్టమొచ్చిన పండ్ల‌ను ఎన్ని సార్లైనా తినండి. పుచ్చ‌కాయ‌లైతే మ‌రీ మంచిది.

డే 2 : వెజ్ టేబుల్ డే… రెండ‌వ రోజు ఉడ‌క‌బెట్టిన,ప‌చ్చి కూర‌గాయాలు తినాలి. ఇష్ట‌మొచ్చిన‌న్ని సార్లు తినొచ్చు. బ్రేక్ పాస్ట్ లో ఒక చిన్న ఆలుగ‌డ్డ‌ను ఉడికించి తినొచ్చు. 1 స్పూన్ బ‌ట్ట‌ర్ తినాలి.

డే 3 : అర‌టిపండు , ఆలుగ‌డ్డ ను మిన‌హాయించి పండ్లు, కూర‌గాయ‌లు ఏవైనా క‌లిపి తినొచ్చు.

డే 4: 4వ రోజు 6 నుండి 8 అర‌టి పండ్లు 3 కొవ్వు తీసిన పాలు తీసుకోవాలి.

డే 5: 250 గ్రాముల చికెన్ లేదా ఫిష్ 6 టొమాటోలను క‌లిపి తినాలి. డీప్ ఫ్రై కాకుండా చూసుకోండి. వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి.

డే 6 : 5 వ రోజు డైట్నే  ఫాలో అవ్వాలి.

డే 7 : బ్రౌన్ రైస్ లేదా 1 చ‌పాతీ, ప్రూట్ జ్యూస్ …. 3 పూట‌లు

వీటితో పాటు రోజుకు 45 నిమిషాల వాకింగ్ అవ‌స‌రం . టీ కాఫీల‌ను మిన‌హాయించి బ్లాక్ గ్రీ టీల‌ను షుగ‌ర్ లేకుండా తాగాలి.

కూతురి ప్యాంట్ పై మ‌ర‌క…. ప‌క్క‌నున్న కుర్రాడు ఇచ్చిన స‌ల‌హా! ఇది క‌దా కావాల్సింది!!

నేను నా కూతురు సిటీ బ‌స్ లో ప్ర‌యాణిస్తున్నాము. నా కూతురి వ‌య‌స్సు 13 ఏళ్లు. త‌న ప్యాంట్ పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు అయ్యాయి…వాటిని త‌ను గుర్తించ‌లేదు. ఇంత‌లో అదే బ‌స్ లో ఉన్న ఓ కుర్రాడు 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉండొచ్చు…. నా కూతురి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న చెవిలో….నీ ప్యాంట్ కు ర‌క్త‌పు మ‌ర‌క‌లున్నాయని చూపిస్తూ….త‌ను వేసుకున్న స్వెట్ట‌ర్ ను తీసి ఇచ్చి….ఇది క‌ప్పుకో… నీ స్టేజ్ రాగానే దిగి ఇంటికి వెళ్లి అమ్మ‌కు చెప్పు…దీని గురించి ఏం ఆందోళ‌న చెంద‌కు ….ఇది సాధార‌ణ విష‌మ‌యే….అంటూ ధైర్యం చెప్పాడు.

మొద‌ట్లో నాకు కాస్త కోపం వ‌చ్చిన‌ప్ప‌టికీ ….ఆ వ‌యస్సులో ఆ అబ్బాయి చూపించిన ప‌రిణితికి, అమ్మాయి స‌మ‌స్య‌ను మాన‌వ‌తా దృక్ప‌థంలో అర్థం చేసుకున్న విధానానికి, రుతుస్రావం ప‌ట్ల అతనికున్న అవ‌గాహ‌న‌ను చూసి చాలా బాగనిపించింది. అత‌డిని పెంచిన త‌ల్లిగారికి అభినంద‌న‌లు చెప్పాల‌నిపించింది. కాలం మారుతుంది అనిపించింది.

పీరియడ్స్ విషయంలో మహిళలు ఈ 4 అసలు మర్చిపోవద్దు!!

మహిళలకు పీరియడ్స్ అనేది కాస్త సమస్యలతో కూడుకున్న అంశంగా చెప్పాలి. దాదాపుగా అందరు మహిళలు కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి వీటి వలన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి. జీవితం మీద విరక్తి వచ్చే సందర్భాలు మహిళలకు వీటి విషయంలోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ఇక వీటి విషయంలో మహిళలకు అవగాహన తక్కువ

చాలా మందికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ కు గురైతే ఇబ్బందులు ఎక్కువ. అయితే వాళ్లకు కొన్ని సూచనలు ఉన్నాయి.

1. రక్తస్రావం తక్కువగా ఉన్నా సరే ప్రతీ 4 నుంచి 6 గంటలకు ఒకసారి న్యాప్ కిన్ మార్చుకోవాలి.
2. రక్తస్రావాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. శుభ్రమైన లో దుస్తులు వాడాల్సి ఉంటుంది. బిగుతుగా ఉండేవి వాడకండి.
4. రక్తస్రావం వలన ఎక్కువగా నీరసపడతారు. తక్షణమే శక్తి కోసం పండ్ల రసాలు, నీళ్ళు, పెరుగు తినాలి.

నానబెట్టిన బాదం పప్పు తింటున్నారా…? అయితే మీరు సేఫ్

ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో కాస్త కీలకం. తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదంటే సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ విషయంలో మనకు చాలా వరకు అవగాహన ఉండదు. మనకు బాదం పప్పు అనేది చాలా మేలు చేస్తుంది.

నానబెట్టిన బాదం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? అంది ఒక్కసారి చూస్తే… ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ లో బాదం ముందు వరుసలో ఉంటుంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దీనిలో ఉంటుంది. బాదం తినడం వలన మన గుండెకు చాలా మేలు చేకూరుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాదం చాలా మంచిది. నానబెట్టిన బాదం మీకు చాలా ఆరోగ్యకరమైనది అని నిపుణులు చెప్తున్నారు. మన భారత ఆచారంలో నానబెట్టిన బాదంపప్పు తినడం అనేది ముందు నుంచి ఉంది. ఉదయాన్ని బాదం పప్పు తినడానికి ప్రాధాన్యత ఇస్తారు.

నానబెట్టిన బాదం నుంచి వచ్చే ప్రయోజనాలు ఒక్కసారి చూద్దాం.

1. పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బాదంలో పోషకాలు ఎక్కువ. బాదంలో మీకు మీకు ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు మరెన్నో ఉంటాయి.

2. మీ హృదయానికి మంచిది

బాదం మంచి కొలెస్ట్రాల్‌ను మనకు అందిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
సాధారణ బాదం పప్పు కంటే నానబెట్టిన బాదంపప్పు వేగంగా జీర్ణం అవుతుంది. నానబెట్టిన బాదం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహించే ఎంజైమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

4. మీ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

వీటిల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జుట్టుకి బాగా కలిసి వస్తుంది. బాదంపప్పులోని విటమిన్ ఈ మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చర్మానికి బాదం నూనె వాడటం కూడా చాలా మంచిది. సుదీర్ఘంగా ఉండే జుట్టు సమస్యలతో పోరాడటానికి బాదం మీకు చాలా సహకరిస్తుంది. జుట్టు రాలకుండా అడ్డుకుంటుంది.

5. మెదడు పనితీరును పెంచుతుంది
బాదం తినడం వల్ల మెదడు పనితీరు చాలా బాగుంటుంది. విటమిన్ ఈ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మతిమరుపు తగ్గే అవకాశం ఉంటుంది.

6. బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మీరు ప్రతిరోజూ నానబెట్టిన బాదంపప్పును తింటే అదనపు కొవ్వును వేగంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దానితో బరువు వేగంగా తగ్గుతుంది.

ఈ ఆహారం తింటే మీ మూత్రపిండాలు సూపర్ అంతే…!

ఆహారం అనేది జాగ్రత్తగా లేకపోతే ఆ ప్రభావం మన ఆరోగ్యం మీద చాలా బాగా పడుతుంది. మారుతున్న కాలంలో ప్రజల ఆహార విధానాలు కూడా మారిపోతున్నాయి. ఆహారం అనేది సరిగా లేకపోతే మూత్రపిండాల మీద ప్రభావం పడుతుంది. అయితే… సృష్టిలో దొరికే ఆహారం మనకు పోషక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ… మన ఆరోగ్యాన్ని మేరుగుపరిచేవి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు.

కానీ ప్రజలు సాధారణంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లేదా ఇతర పోషకాలను అసాధారణంగా ఉండే ఆహారాలను సూపర్ ఫుడ్స్ అనడం మొదలుపెట్టారు. మన శరీరం దాని జీవక్రియ మరియు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి ముఖ్యమైన అవయవాలపై (గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం మరియు ప్లీహము) ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగం మనకు ముఖ్యమే…

అయితే పైన పేర్కొన్న వాటిల్లో ఏది విఫలం అయినా సరే… ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే మూత్రపిండాలు విఫలం అయిన వాళ్ళు మరణానికి ఒకరకంగా దగ్గర ఉన్నట్టే. కాబట్టి… మీ మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడే ఆహారం గురించి మీరు తెలుసుకోవాలి. ప్రోటీన్, కేలరీలు, విటమిన్లు మరియు ఖనిజాలు అన్నీ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి. వీటిల్లో ఒక 5 రకాల ఆహారంతో కూడిన ప్యాక్ ఒకటి ఉంది.

నీరు: ఇది శరీరానికి చాలా ముఖ్యం. నీరు ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత మంచిది. మీ శరీరంలో ఉండే ఎన్నో విష వలయాలను నీళ్ళు శుద్ధి చేసి బయటకు మూత్రం ద్వారా పంపేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం, తగినంత నీరు త్రాగాలని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా, రోజంతా కనీసం 2-3 లీటర్లు నీరు త్రాగాలి. మీ ఆహారంలో అదనపు ఉప్పు వాడటం మానేస్తే మంచిది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు.

water images

యాపిల్స్: యాపిల్స్ ఖరీదైనవి కావడంతో చాలా మంది వెనక్కు తగ్గుతూ ఉంటారు. ఇది కరిగే ఫైబర్… కొలెస్ట్రాల్ మరియు గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లకు ఇది ముఖ్యమైన మూలం. మెదడు కణాలను కూడా యాపిల్స్ ఈ పండు మీ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.

applefrut image

చేప: ఒమేగా -3… కొవ్వు ఆమ్లాలు మన శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవాలి. సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న కొవ్వు చేపలను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప సహజ వనరు చేపలు. ఒమేగా -3 కొవ్వులు రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. నియంత్రిత రక్తపోటు మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు.

క్రాన్బెర్రీస్: ఈ రుచికరమైన బెర్రీలు… మూత్రాశయ గోడకు బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధిస్తాయి. దీని ద్వారా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారికి, మూత్రపిండాల పనితీరు తగ్గుతుందనే భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ భాస్వరం మరియు పొటాషియం కలిగిన ఆహారాన్ని తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. పాల ఆహారాలు, బీన్స్, కాయ ధాన్యాలు, కాయలు మరియు టీ, సోడాలు కూల్ డ్రింక్ లు ఆపితే మంచిది.

పిల్లల్ని క‌నేందుకు స్త్రీ, పురుషుల‌కు స‌రైన వ‌య‌స్సు ఎంత‌?

25-28 …. స్త్రీ పురుషులిద్ద‌రికీ పిల్ల‌ల్ని క‌న‌డానికి ఇదే స‌రైన వ‌య‌స్సు.! ఈ ఏజ్ లో స్త్రీల‌లో నెల‌స‌రిగా స‌రిగ్గా ఉంటుంది. పురుషులలో వీర్య‌క‌ణాలు చాలా యాక్టివ్ గా ఉండే ద‌శ ఇదే.!

correct age

  • పురుషుల‌కు 30 ఇయ‌ర్స్ దాటితే వారిలో ఉత్ప‌త్తయ్యే టెస్టోస్టిరాన్ స్థాయి సంవ‌త్స‌రానికి 1 ప‌ర్సంటేజ్ చొప్పున త‌గ్గుతుంద‌ట‌‌… అది వీర్య క‌ణాల ఉత్ప‌త్తిపై ప్ర‌భావం చూపుతుంది!
  • డ్రింకింగ్ , స్మోకింగ్, పోష‌కాహార లోపం, టైట్ బ‌ట్ట‌లు ధ‌రించ‌డం, నిద్ర‌లేమి ఇవి కూడా సంతానోత్ప‌త్తిపై ప్ర‌భావం చూపుతాయి..కాబ‌ట్టి స్త్రీ, పురుషులిద్ద‌రూ వీటి విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.!
  • 30 లోపే పిల్ల‌ల్ని క‌న‌డం వ‌ల్ల‌….ఆ భార్య‌భ‌ర్త‌లు వృద్దాప్యానికి వ‌చ్చే స‌మ‌యానికి ఈ పిల్ల‌లు సెటిల్ అయ్యి ఉంటారు. దీంతో పిల్ల‌ల టెన్ష‌న్ కూడా వారి మీద ప‌డ‌దు.!

 

కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తిన‌కూడ‌ద‌ట‌.. ఉడ‌క‌బెట్టుకునే తినాల‌ట‌.. ఎందుకంటే..? 

కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి ప‌నికొచ్చే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు, ఐర‌న్ వంటి ముఖ్య‌మైన పోష‌కాలు మ‌న‌కు కోడిగుడ్ల‌లో ల‌భిస్తాయి. నిత్యం మ‌నం కోడిగుడ్ల వంటి పోష‌కాహారాన్ని తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. కోడిగుడ్ల‌లో ఉండే విట‌మిన్ ఎ, విట‌మిన్ బి12 లు మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. కోడిగుడ్ల వ‌ల్ల మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరం యాక్టివ్‌గా ఉంటుంది.
అయితే కొంద‌రు మాత్రం కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్ట‌కుండా ప‌చ్చిగా అలాగే ప‌గ‌లగొట్టుకుని తింటారు. ఈ నేప‌థ్యంలో వారు ఏమ‌ని అనుకుంటారంటే.. కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెడితే వాటిల్లో ఉండే పోష‌కాలు న‌శిస్తాయ‌ని అనుకుంటారు. అందుకే కొంద‌రు కోడిగుడ్ల‌ను ప‌చ్చిగానే తాగేస్తారు. అయితే నిజంగా కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెడితే వాటిలో ఉండే పోష‌కాలు న‌శిస్తాయా..? ప‌చ్చి కోడిగుడ్లే మ‌న‌కు మేలా..? అంటే.. కాదు అని సైంటిస్టులు చెబుతున్నారు.
ప‌చ్చి కోడిగుడ్ల‌లోనే పోష‌కాలు ఉంటాయ‌ని, వాటిని ఉడ‌క‌బెడితే వాటిలో ఉండే పోష‌కాలు న‌శిస్తాయ‌ని అనుకోవ‌డం పొర‌పాటే అవుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టుకుని మాత్ర‌మే తినాలని, ప‌చ్చివి తిన‌కూడ‌ద‌ని అంటున్నారు. ప‌చ్చి కోడిగుడ్లను తిన‌డం వ‌ల్ల కొన్ని పోష‌కాల‌ను మ‌నం కోల్పోతామ‌ని, ఉడ‌క‌బెట్టుకుని తింటేనే కోడిగుడ్ల‌లో ఉండే అన్ని పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ప‌చ్చి కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల లాభం ఉండ‌క‌పోగా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాతో విష జ్వ‌రాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా వారు తెలియ‌జేస్తున్నారు. క‌నుక కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టుకుని తింటేనే మంచిది..!

జ్వ‌రం వ‌చ్చిన వారు కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చా..?  తింటే ఏమ‌వుతుంది..? 

ఇంట్లో ఎవ‌రికైనా జ్వ‌రం వ‌చ్చిందంటే చాలు.. ఇంట్లో ఉన్న వారంద‌రూ బాధ‌ప‌డ‌తారు. జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గాలనే ఎవ‌రైనా కోరుకుంటారు. అందులో భాగంగానే కుటుంబ స‌భ్యులు జ్వ‌రం వ‌చ్చిన వారికి పండ్లు, జ్యూస్‌లు త‌దిత‌ర ఆహారాల‌ను తినిపిస్తుంటారు. అయితే సాధార‌ణంగా జ్వ‌రం ఎవ‌రికైనా వ‌స్తే.. వారు తీసుకునే ఆహారం ప‌ట్ల కొంద‌రిలో అనేక అనుమాలు వ‌స్తుంటాయి. ఫ‌లానా ఆహారం తినాల‌నో, ఫ‌లానా ప‌దార్థాల‌ను తిన‌కూడ‌ద‌నో అనుకుంటుంటారు. అందులో భాగంగానే జ్వ‌రం వ‌చ్చిన వారు దాదాపుగా నాన్ వెజ్ ఐట‌మ్స్‌ను తిన‌రు. తింటే జ్వ‌రం ఇంకా పెరుగుతుంద‌ని అనుకుంటారు. అయితే ఇత‌ర నాన్ వెజ్ ఐట‌మ్స్‌తో జ్వ‌రం పెరిగే మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల జ్వ‌రం పెర‌గ‌దు. దాంతో మ‌న‌కు మంచే జ‌రుగుతుంద‌ట‌.
fever eat egg
జ్వరం వ‌చ్చిన వారు మాంసాహారం తిన‌కూడ‌ద‌ని తెలుసు. కానీ కోడిగుడ్ల‌కు అందుకు మిన‌హాంపు ఉంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. జ్వ‌రం వ‌చ్చిన వారు ఇత‌ర మాంసాహారాల‌ను కాకుండా కోడిగుడ్ల‌ను తీసుకుంటే మంచిద‌ట‌. అయితే వాటిని ఉడ‌క‌బెట్టి మాత్ర‌మే తినాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్ల‌లో ఉండే పోష‌కాలు.. ముఖ్యంగా ప్రోటీన్లు జ్వ‌రం వ‌చ్చిన వారికి శ‌క్తిని అందించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక జ్వ‌రం వ‌చ్చిన వారు ఎవ‌రైనా కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టుకుని భేషుగ్గా తిన‌వ‌చ్చు.
egg fever
అయితే జ్వ‌రంలో ఉన్న‌వారికి ఆక‌లి బాగా ఉంటేనే కోడిగుడ్ల‌ను తినాలి. ఆక‌లి లేకుంటే కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దు. ఎందుకంటే జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక కోడిగుడ్లను తిన‌రాదు. కానీ.. జ్వ‌రంలో ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే జ్వ‌రంలో ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తింటే బాగా ఉడ‌కబెట్ట‌డం త‌ప్ప‌నిసరి. లేదంటే వాటిలో ఉండే సాల్మొనెల్లా వ‌ల్ల జ్వ‌రం తీవ్ర‌త మ‌రింత పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక తెలిసింది క‌దా.. ఇక‌పై జ్వ‌రం వ‌స్తే కోడిగుడ్ల విష‌యంలో సందేహించ‌కండి. నిర్భ‌యంగా తినేయండి. కానీ పైన సూచించిన జాగ్ర‌త్త‌ల‌ను మాత్రం కచ్చితంగా పాటించండి..!

అశ్వ‌గంధ‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు కలుగుతాయో మీకు తెలుసా !?

ఆయుర్వేదంలో అశ్వ‌గంధ‌కు అధిక ప్రాధాన్య‌త ఉంది. దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో అశ్వ‌గంధ అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్నే ఇండియ‌న్ జిన్సెంగ్ అని కూడా పిలుస్తారు. అదే ఆంగ్లంలో అయితే వింట‌ర్ చెర్రీ అంటారు.

ashvagandam healtrh benfits

 

అశ్వ‌గంధ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఇవే…

1. అశ్వ‌గంధ మ‌నకు శారీర‌క ఆరోగ్యాన్నే కాదు, మాన‌సిక ఆరోగ్యాన్ని కూడా అంద‌జేస్తుంది. దీని వ‌ల్ల మెద‌డు, శ‌రీరం, మ‌న‌స్సు అన్నీ ఉత్తేజ‌మ‌వుతాయి.

2. అశ్వ‌గంధ యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. దీంతో అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. శ‌క్తి పెరుగుతుంది. ఎక్కువ‌కాలం ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చు.

3. అశ్వగంధ‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిర‌క్షిస్తాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి.

4. అశ్వ‌గంధ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. క్లోమ‌గ్రంథి ఇన్సులిన్ ను ఎక్కువ‌గా ఉత్పత్తి చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

5. అశ్వ‌గంధ‌లో ఉండే ఔష‌ధ గుణాలు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. ఆ క‌ణాలను పెర‌గ‌కుండా చూస్తాయి.

6. అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడేందుకు తెల్ల ర‌క్త క‌ణాల‌కు కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

7. ఒత్తిడి ఎక్కువైన‌ప్పుడు మ‌న శ‌రీరంలో కార్టిసోల్ అన‌బ‌డే హార్మోన్ విడుద‌ల‌వుతుంది. ఇది మ‌న‌కు మంచిది కాదు. అయితే అశ్వ‌గంధ‌ను తీసుకుంటే ఈ హార్మోన్ స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో ఒత్తిడి త‌గ్గుతుంది.

8. అశ్వ‌గంధ స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ డిప్రెసెంట్‌లా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

9. అశ్వ‌గంధ‌ను వాడ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది.

10. శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు పెరుగుతాయి. శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటుంది. అన్ని అవ‌య‌వాల‌కు శ‌క్తి అందుతుంది.

11. శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌ల‌కు థైరాయిడ్ గ్రంథి, అడ్రిన‌ల్ గ్రంథులు కార‌ణ‌మ‌వుతాయి. ఇవి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హింప‌బ‌డ‌వు. అయితే అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ గ్రంథులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.

గ‌మ‌నిక‌: అశ్వగంధ కొంద‌రికి అల‌ర్జీ క‌లిగిస్తుంది. అందువ‌ల్ల దీన్ని వాడేముందు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

 

Next Page »