Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

సికింద్రాబాద్ -తిరుప‌తి వందేభార‌త్ రైలు….న‌ల్గొండ, గుటూరుల మీదుగా…..

Advertisement

సికింద్రాబాద్ నుండి 2వ వందేభార‌త్ రైలుకు ముహూర్తం ఖ‌రారైంది. ఏప్రిల్ 8న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించ‌నున్నారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ – నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరుల మీదుగా తిరుప‌తికి చేరుకుంటుంది. ప్ర‌స్తుతం 12 గంట‌లు ప‌డుతున్న జ‌ర్నీ వందేభార‌త్ కార‌ణంగా 9గంట‌ల‌కు త‌గ్గ‌నుంది.
తిరుప‌తికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్తారు కాబ‌ట్టి ఈనిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

Advertisements

ప్ర‌స్తుతం సికింద్ర‌బాద్ – వైజాగ్ కు న‌డ‌ప‌బ‌డుతున్న వందేభార‌త్ సెమీ హైస్పీడ్ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో న‌డుస్తోంద‌ని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు తిరుప‌తి వందేభార‌త్ రైల్ కోసం ప్ర‌స్తుతం 110 కి.మీ గా ఉన్న బీబీన‌గ‌ర్- గుంటూర్ మార్గాన్ని 130 కి.మీ గా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.

Advertisements

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల చేసిన రేటింగ్స్ లో NTV TV9 ను దాటి మొద‌టి స్థానాన్ని సాధించింది. ఫిబ్రవరి 2, 2022 నుండి మార్చి 11, 2022 మధ్య సేకరించిన డేటా ప్రకారం తెలుగు వార్తా ఛాన‌ల్స్ లో NTV టాప్ ప్లేస్ లో నిల్చింది. ఇక హిందీలో ఆజ్ త‌క్ ఫ‌స్ట్ ప్లేస్ లో కొన‌సాగుతుంది. హైద్రాబాద్ లో మాత్రం జ‌నాలు TV9 ను ఎక్క‌వ‌గా వీక్షిస్తున్నారు.

బార్క్ విడుద‌ల చేసిన రేటింగ్స్ ప్ర‌కారం…ఆయా ఛాన‌ల్స్ ర్యాంకింగ్స్ :
1) NTV
2) TV9
3) V6
4) TV5
5) సాక్షి
6) టి-న్యూస్
7) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
8) 10 టీవీ
9) HMTV
10) Mahaa News

గూగుల్ నుండి 1.10 కోట్ల ఆఫ‌ర్!

పాట్నాకు చెందిన సంప్రీతికి గుగూల్ 1.10 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చింది. లండ‌న్ లో జాబ్ చేయాల‌ని ఆఫ‌ర్ లెట‌ర్ చేతికిచ్చింది. 9 రౌండ్ల ఇంట‌ర్వ్యూ త‌ర్వాత సంప్రీతికి ఈ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది గుగూల్ . ఫిబ్ర‌వ‌రి 14న జాబ్ లో జాయిన్ అవ్వాల‌ని తెల్పింది.

బీహార్ లోని పాట్నాకు చెందిన సంప్రీతి త‌ల్లిదండ్రులిద్ద‌రూ మంచి మంచి పొజీష‌న్ లో ఉన్నారు. సంప్రీతి కూడా చిన్న‌ప్ప‌టి నుండి చ‌దువులో ముందుండేది. అందుకే టెన్త్ లో 10 జిపిఏ సాధించింది. 12వ త‌ర‌గ‌తి పూర్త‌వ్వ‌గానే JEE మెయిన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఢిల్లీ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ నుండి బిటెక్ కంప్యూట‌ర్ సైన్స్ ను కంప్లీట్ చేసింది.

ఫైన‌ల్ ఇయ‌ర్ లో ఉండ‌గానే 4 పెద్ద పెద్ద సంస్థ‌ల నుండి సంప్రీతికి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. 44 లక్ష‌ల ప్యాకేజ్ కు మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యింది. అలా జాబ్ చేస్తూనే గుగూల్ ఆఫ‌ర్ చేసిన ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రై… 9 రౌండ్ల‌ను క్లియ‌ర్ చేసి 1.10 కోట్ల ప్యాకేజ్ తో జాక్ పాట్ కొట్టేసింది.

10 రూపాయ‌లు పెట్టి కొన్న కోడి పిల్ల‌కు 50 రూపాయ‌ల టికెట్ ! RTC నిర్వాహం!

10 రూపాయ‌లు పెట్టి కొన్న కోడి పిల్ల‌కు 50 రూపాయ‌ల టికెట్ ఇచ్చిన ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో జ‌రిగింది. క‌ర్నాట‌క‌లోని హోస‌న‌గ‌ర నుండి శిర‌సికి వెళ్ల‌డానికి భార్యాభ‌ర్తలు RTC బ‌స్సు ఎక్కారు . అంత‌కు ముందే అక్క‌డ క‌ల‌ర్ కోడి పిల్ల‌లు క‌న‌బ‌డ‌డంతో 10 రూ పెట్టి ఒక‌దానిని కొనుగోలు చేశారు.

టికెట్ ఇవ్వ‌డానికి వ‌చ్చిన కండ‌క్ట‌ర్…. 210 రూపాయ‌ల టికెట్ ఇచ్చారు. భార్య ద‌గ్గ‌ర ఉన్న కోడిపిల్ల‌ను చూసి దానికి కూడా టికెట్ తీసుకోవాల‌ని కోరాడు కండ‌క్ట‌ర్….కాదు కుద‌ర‌దు అని కొద్దిసేపు వాగ్వాదం జ‌రిగిన త‌ర్వాత తోటి ప్ర‌యాణికులు కూడా టికెట్ తీసుకోవాలని ఒత్తిడి చేయ‌డంతో 50 రూపాయ‌లిచ్చి టికెట్ కొన్నాడు.

కొడుకులు కాద‌న్నారు…4 గురు కూతుళ్లు త‌ల్లి పాడె మోశారు.

కొడుకులు కాద‌న్నారు….4 గురు కూతుళ్లు క‌లిసి త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌ను పూర్తిచేశారు. ఈ ఘ‌ట‌న ఒడిషాలోని మంగ‌ల్ ఘాట్ లో జ‌రిగింది. జ‌తి నాయ‌క్ అనే మ‌హిళ‌కు ఇద్ద‌రు కొడుకులు, న‌లుగురు కూతుళ్లు భ‌ర్త చ‌నిపోయాడు.

గత ప‌ది సంవ‌త్స‌రాల నుండి జ‌తి నాయ‌క్ కొడుకులు ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆరోగ్యం బాగాలేక‌పోయినా వాళ్లు క‌న్నెత్తి చూడ‌లేదు. ఇటీవ‌ల ఆమె ఆరోగ్యం మ‌రీ క్షీణించ‌డంతో స్థానికులు ఆమెను ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ కు త‌రలించారు. అక్క‌డే ఆమె మ‌ర‌ణించింది.

త‌ల్లి మ‌ర‌ణాంత‌రం కూడా కొడుకులు రాలేదు. దీంతో ఆమె న‌లుగురు కూతుళ్లు పాడె మోయ‌డ‌మే కాకుండా త‌ల్లి అంత్య‌క్రియల‌ను చేశారు.

అయోధ్య‌లో కొత్త రైల్వే స్టేష‌న్.. రామ మందిరం డిజైన్ లోనే నిర్మాణం- ఫోటోలు!

అయోధ్య‌లో మార్చి 2022 లోపు కొత్త రైల్వే స్టేష‌న్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేష‌న్ ప‌నులు 2018లోనే స్టార్ట్ అయ్యాయి . రెండు ద‌శ‌ల్లో నిర్మాణం కానున్న ఈ స్టేష‌న్ డిజైన్లు రామ మందిరాన్ని పోలి ఉండ‌నున్నాయి.

రామ మందిర నిర్మాణం త‌ర్వాత పోటెత్త‌నున్న భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే రైల్వే స్టేష‌న్ నిర్మాణం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం రోజుకు 4వేల‌కు పైగా ప్ర‌యాణికులు ఈ స్టేష‌న్ నుండి రాక‌పోక‌లు సాగిస్తున్నారు. మందిర నిర్మాణం పూర్త‌య్యాక ప్ర‌త్యేక దినాల‌లో 10 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌యాణికులు ఈ రైల్వే మార్గం నుండి వ‌స్తార‌ని అంచ‌నా..ఆ అంచ‌నాకు త‌గ్గ‌ట్టే నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. మొద‌టి ద‌శ‌లో 126 కోట్ల‌ను వెచ్చించ‌నున్న ప్ర‌భుత్వం , రెండ‌వ ద‌శ‌లో 300 కోట్ల‌ను వెచ్చించ‌నుంది.

2018 లోనే IRCTC ది రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ పేరుతో 16 రోజుల ట్రిప్ ను ప్లాన్ చేసింది. ఈ ట్రైన్ డిల్లీ నుండి రామాయ‌ణ విశిష్ట‌త‌గ‌ల ప్రాంతాల‌ను క‌వ‌ర్ చేసుకుంటూ అయోధ్య చేరుకుంటుంది.

రెండు రోజుల్లో 150 కోట్ల మ‌ద్యం తాగిన స్టేట్!

కేర‌ళ‌ల‌లో క్రిస్ మ‌స్ వేడుకల్లోభాగంగా 24,25 తేదీల్లో ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు దాదాపు 150 కోట్లు విలువ చేసే మ‌ద్యాన్ని తాగారట‌! ఆ రెండు రోజుల్లో దాదాపు 150 కోట్ల , 38 ల‌క్ష‌ల బిజినెస్ జ‌రిగింద‌ని ఆ రాష్ట్ర బేవ‌రేజెస్ కార్పోరేష‌న్ తెలిపింది. అందులో కూడా బీర్ సేల్స్ చాలా ఎక్కువ‌గా జ‌రిగాయ‌ట‌! గ‌త ఏడాది క్రిస్ మ‌స్ తో పోల్చుకుంటే ఈ యేడు దాదాపు 10 కోట్ల అధ‌న‌పు ఆదాయం వ‌చ్చింద‌ట‌!

ఆగ‌స్ట్ 11-21 లో దాదాపు 10 రోజుల పాటు కేర‌ళ‌లో ఓన‌మ్ ఉత్స‌వాలు జ‌రిగాయి. ఆ సంద‌ర్భంగా ఆ 10రోజుల్లో 750 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయ‌ట‌! ఇది ఆల్ టైమ్ రికార్డ్… ఇక ఒన‌మ్ కు ఒక్క రోజు ముందు జ‌రిగే ఉత్త‌రాధామ్ రోజు 85 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయ‌ట‌…ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.

3.4 కోట్లున్న కేర‌ళ జ‌నాభాలో 32 ల‌క్ష‌ల మందికి ఆల్కాహాల్ అల‌వాటుంద‌ట‌!అందులో 29 ల‌క్ష‌ల‌ మంది పురుషులు అయితే 3 ల‌క్ష‌ల మంది స్త్రీలు. 5ల‌క్ష‌ల మందికి ప్ర‌తిరోజూ మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంద‌ట‌!

జ‌ర్మ‌నీ అబ్బాయి, ర‌ష్యా అమ్మాయి….హిందూ సాంప్ర‌దాయంలో పెళ్లి! ఎందుకిలా?

జ‌ర్మ‌నీ కి చెందిన క్రిస్ ముల్ల‌ర్ ర‌ష్యాకు చెందిన జులియా ఉఖ్వాటినా ను గుజారాత్ లోని స‌ర్వోద‌య అనే గ్రామంలో హిందూ సాంప్ర‌దాయంలో పెళ్లి చేసుకున్నాడు. ముల్ల‌ర్ జ‌ర్మ‌నీలోని అత్యంత ధ‌నిక కుటుంబంల్లో పుట్టాడు. అలా విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తున్న క్ర‌మంలో ఇండియా క‌ల్చ‌ర్ ను ఇష్ట‌ప‌డి కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డే ఉండిపోయాడు. తన ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ ను వ‌దిలి సింపుల్ లైఫ్ స్టైల్ లోకి మారిపోయాడు.

ఇండియాలోనే స్పిరిటిటో UG & ఇన్న‌ర్ లివింగ్ అనే కంపెనీని స్థాపించి దాని ద్వారా యోగా, మెడిటేష‌న్ లో శిక్ష‌ణ ఇస్తున్నాడు. అలా అత‌నికి జులియా ప‌రిచ‌యం అయ్యింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో ఇండియాలోనే లాలాభాయ్ ప‌టేల్ అనే వ్య‌క్తి స‌హాయంతో హిందూ సాంప్ర‌దాయంలో వివాహం చేసుకున్నాడు, గ‌ణ‌ప‌తి పూజ‌, హ‌ల్దీ కార్య‌క్ర‌మంతో పాటు ఏడ‌డుగుల న‌డ‌క కూడా పూర్తిచేసి జులియాను మ‌నువాడాడు ముల్ల‌ర్ కోవిడ్ కార‌ణంగా వ‌దూవ‌రుల కుటుంబ స‌భ్యులెవ‌రూ పెళ్లికి హాజ‌రుకాన‌ప్ప‌టికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ముద్దు ఇవ్వ‌నందుకు…. భాయ్ ఫ్రెండ్ పై పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి!

ఇంగ్లాండ్ లోని లింక‌న్ షైర్ లో ఓ అమ్మాయి త‌న భాయ్ ఫ్రెండ్ త‌న‌కు ముద్దు ఇవ్వ‌లేద‌ని అక్క‌డి ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ అయిన 999 కు కాల్ చేసి పోలీసుల‌కు కంప్లైంట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి కంప్లైంట్ విన్న పోలీసులు ఇలాంటి పిర్యాదుల‌తో త‌మ టైమ్ వేస్ట్ చేయొద్ద‌ని ఆమెకు కౌన్సెలింగ్ చేశారు.

ఇలాంటి ఘ‌ట‌నే మ‌న దేశంలోని మ‌ద్య ప్ర‌దేశ్ లోని చింద్వారాలో జ‌రిగింది. త‌న బ‌ర్త్ డే రోజు త‌న ల‌వ‌ర్ త‌న‌కు విష్ చేయ‌లేద‌ని పోలీసుల‌కు కంప్లైంట్ చేశాడు. అమ్మాయిని స్టేష‌న్ కు పిలిచి ఇద్ద‌రికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. త‌ర్వాత వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశారు.

పారాసెయిలింగ్ తాడు తెగింది 100 మీట‌ర్ల ఎత్తునుండి పడింది. వీడియో

ముంబాయి చెందిన ఇద్దరు మ‌హిళ‌లు పారా సెయిలింగ్ కోసం ద‌గ్గ‌ర్లోని స‌ముద్రానికి వెళ్లారు. లైఫ్ జాకెట్లు వేసుకున్న ఆ ఇద్ద‌రూ పారాచూట్ స‌హాయంతో గాల్లోకి వ‌ద‌ల‌బ‌డ్డారు. అలా వారు బోట్ నుండి 100 మీటర్ల ఎత్తు వెళ్లాక వాళ్ల‌కు క‌ట్టిన తాడు తెగిపోవ‌డంతో ….వారిద్ద‌రూ అక్క‌డి నుండి బోటుకు దూరంగా స‌ముద్రంలో ప‌డిపోయారు. అదృష్టవ‌శాత్తు వారిద్ద‌రూ లైఫ్ జాకెట్స్ ధ‌రించ‌డంతో ప్ర‌మాదం నుండి గ‌ట్టెక్కారు బోటు సిబ్బంది స‌కాలంలో అక్క‌డికి చేరుకొని వారిని ర‌క్షించ‌గ‌లిగారు. వారిద్ద‌రికీ ఈత రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


ఇలాంటి ఘ‌ట‌న‌లో ఇటీవ‌ల చాలా జ‌రుగుతూనే ఉన్నాయి. పారాసెయిలింగ్ ను ఆఫ‌ర్ చేసే కంపెనీలు తమ ఈక్విప్మెంట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిచేసుకోట్లేదు. అజిత్ అనే వ్య‌క్తి త‌న భార్య‌ను తీసుకొని పారాసెయిలింగ్ కు వెళ్లాడు. వారికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. దీనిపై ప్ర‌శిస్తే స‌ద‌రు సంస్థ స‌రిగ్గా స‌మాధానం కూడా ఇవ్వ‌లేదు. వారు కూడా లైఫ్ జాకెట్స్ ధ‌రించ‌డంతో బ‌తికిపోయారు.

@VisitDiu @DiuTourismUT @DiuDistrict @VisitDNHandDD
Parasailing Accident,
Safety measures in India,
and they said very rudely that this is not our responsibility. Such things happens. Their response was absolutely pathetic.#safety #diu #fun #diutourism #accident pic.twitter.com/doN4vRNdO8

— Rahul Dharecha (@RahulDharecha) November 14, 2021

Next Page »