Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

రోహిత్ శ‌ర్మ త‌ప్పిదాల వ‌ల్లే సూర్య 3 సార్లు గోల్డెన్ డ‌క్ అయ్యాడు : పాక్ ప్లేయ‌ర్!?

Advertisement

రోహిత్ శ‌ర్మ త‌ప్పిదాల వ‌ల్లే సూర్య 3 సార్లు గోల్డెన్ డ‌క్ అయ్యాడని పాకిస్తాన్ ఆట‌గాడు డానిష్ క‌నేరియా అభిప్రాయ‌ప‌డ్డాడు. అస్ట్రేలియా తో జ‌రిగిన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టోర్నీలో సూర్య వ‌రుస‌గా మూడు మ్యాచ్ లో గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. మొద‌టి రెండు మ్యాచ్ లు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో LBW అయిన సూర్య‌, డిసైడ‌ర్ మ్యాచ్ లో జ‌స్టిన్ అగ‌ర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది టీమ్ ఇండియా సీరిస్ ఓటమిపై తీవ్ర ప్ర‌భావం చూపింది. సూర్య ఫామ్ లో లేక ఇబ్బంది ప‌డుతున్న సంద‌ర్భంలో రోహిత్ కెప్టెన్ గా సూర్య‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సింది పోయి.. మూడవ మ్యాచ్ లో అత‌డిని 7వ బ్యాట్స్ మెన్ గా దించాడు. అస‌లే ఆత్మ‌విశ్వాసం కోల్పోయి కాస్త ఇబ్బందిగా ఉన్న సూర్య‌ను రోహిత్ నిర్ణ‌యం మ‌రింతగా కాన్ఫిడెన్స్ ను కోల్పోయేలా చేసింది.

Advertisement

 

Advertisements

కోహ్లీకూడా ఫామ్ కోల్పోయిన‌ప్పుడు టీమ్ అంతా అత‌నికి స‌పోర్ట్ గా ఉన్నారు. అనేక అవ‌కాశాలు ఇచ్చారు. కానీ అత‌ని బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను మాత్రం మార్చ‌లేదు. సూర్య విష‌యంలో కూడా అదే చేసి ఉండాల్సింద‌ని డానిష్ క‌నేరియా అన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్ర‌స్తుతం నెం.1 స్థానంలో ఉన్నాడు. వన్డేలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు 433 పరుగులు మాత్రమే చేశాడు.

Advertisements

ఆ 175 పరుగుల ముందు సచిన్ వంద సెంచరీలు, రోహిత్ డబుల్ సెంచరీలు కూడా చాలవు, నేటి తరానికి తెలియని లెజెండ్…!

ఇండియన్ క్రికెట్ చరిత్ర గురించి చాలా మందికి అవగాహన లేదు. గంగూలీ తర్వాత నుంచే క్రికెట్ అనేది చాలా మందికి అవగాహన ఉంది. గంగూలి ఇండియా టీం లో తీసుకొచ్చిన సంస్కరణలు, సెహ్వాగ్, గంభీర్, ధోనీ, యువరాజ్ లాంటి ఎందరో యువ కెరటాలను అప్పట్లో టీంలోకి తీసుకొచ్చి ఇండియన్ క్రికెట్ గతిని మార్చేశాడు.

దీనితో ఇండియన్ క్రికెట్ అంటే గంగూలి అనే వరకు వెళ్ళింది. కానీ ఇండియన్ క్రికెట్ కు జీవం పోసింది గంగూలీ కాదు… “రాంలాల్ కపిల్‌దేవ్ నిఖాంజ్” అనే సంచలనం. ప్రపంచంలో ఏ టీంలో ఏ ఆల్ రౌండర్ రాణించినా సరే అతనితో పోలుస్తూ ఉంటారు క్రికెట్ పండితులు. ఆ ఆల్ రౌండరే భారత క్రికెట్ కు జీవం పోసింది. ఒకే ఒక్క మ్యాచ్ తో ఇండియన్ క్రికెట్ కు చరిత్రను సృష్టించాడు.

1983 ప్రపంచకప్ గెలిచాం అంటే ఏ ఒక్కరి ఘనతో కాదు. ఆ ఒక్కడి పుణ్యమే అనడంలో ఏ సందేహం లేదు. అప్పటికే క్రికెట్ లో పాతుకుపోయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కూడా ఓడించి చరిత్ర సృష్టించారు. జింబాబ్వే చేతిలో మనం 17/5 పరుగుల వద్ద కష్టాల్లో ఉంటే… టాప్ ఆర్డర్ బాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కి వెళ్తే బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నదీ ఇద్దరంటే ఇద్దరే ఆల్‌ రౌండర్లు, నలుగురు బౌలర్లు. కపిల్ ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. ఆ రోజు జట్టు మొత్తం పరుగులు 266/8. కపిల్ ఒక్కడే 175 చేసి జట్టుని విజయతీరాలకు చేర్చాడు.

టాప్ ఆర్డర్ లో ఆడితే సెంచరీ చేయడం పెద్ద కష్టం కాదు. మిడిల్ ఆర్డర్ లో ఆడినా సరే కష్టం కాదు. ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేయడం అనేది నిజంగా ఒక సంచలనం. తన తోటి బౌలర్లతో కూడా బ్యాటింగ్ చేయించి గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఆ మ్యాచ్ తో ప్రతీ ఆటగాడిలో నూతన ఉత్తేజం వచ్చింది. దీనితో ఫైనల్ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించి తొలి ప్రపంచకప్ అందుకుంది. అద్భుతమైన కాచ్ ద్వారా వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేసి సగర్వంగా ప్రపంచకప్ అందుకుని నిజమైన కెప్టెన్ అయ్యాడు. ఆ రోజు జింబాబ్వే మీద కపిల్ చేసిన 175 పరుగులకు సచిన్ వంద సెంచరీలు, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు, కోహ్లీ వేల పరుగులు కూడా సాటి రావు.

Also Read: రేషన్ బియ్యం తినొచ్చా…?

క్రికెట్ లో బ్ర‌ద‌ర్స్… ఒక‌రు స‌క్సెస్ ఒక‌రు ఫెయిల్ !!

ఒక ఇంటి నుండి ఒక‌రు దేశం త‌ర‌ఫున ప్రాతినిద్యం వ‌హిస్తేనే గొప్ప అలాంటిది అన్నద‌మ్ములిద్ద‌రూ త‌మ దేశం త‌ర‌ఫున ఆడితే… ఇలాంటి గొప్ప అవకాశం చాలా మందికి వ‌చ్చింది. క్రికెట్ లో ఇలా బ్ర‌ద‌ర్స్ క‌లిసి ఆడిన సంద‌ర్భాలు ఎన్నో….

  • కృనాల్ పాండ్య‌, హార్దీక్ పాండ్య : త‌మ్ముడు హార్దీక్ స‌క్సెస్… కృనాల్ జ‌ట్టులో స్థానం కోసం ఇంకా స్ట్ర‌గ్లింగ్

  • యూసుఫ్ ప‌ఠాన్ , ఇర్ఫాన్ ప‌ఠాన్:  ప్ర‌స్తుతం ఇద్ద‌రూ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన‌ప్ప‌టికీ..అన్న యూసుఫ్ కంటే త‌మ్ముడు ఇర్ఫాన్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది

  • ఆల్బీ మోర్కల్, మోర్నీ మోర్కల్ : వీరిద్ద‌రూ ద‌క్షిణాఫ్రికాకు ఆడుతున్నారు. వీరి తండ్రి కూడా ద‌క్షిణాఫ్రికాకు ఆడాడు. వీరిద్ద‌రిలో ప్ర‌స్తుతం మోర్నీ టీమ్ లో కొన‌సాగుతున్నాడు.

  • క‌మ్రాన్ అక్మ‌ల్, అద్నాన్ అక్మ‌ల్, ఉమ్రాన్ అక్మ‌ల్ : పాకిస్తాన్ కు చెందిన ఈ ముగ్గురు బ్ర‌ద‌ర్స్ లో క‌మ్రాన్ 11 ఏళ్ల పాటు పాక్ కు ఆడాడు. క‌మ్రాన్ కు వ‌చ్చిన పేరు త‌మ్ముళ్ల‌కు రాలేదు.

  • షాన్ మార్ష్ , మిచెల్ మార్ష్ : ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ అయిన ఈ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ మంచి పేరు సంపాదించుకున్నారు.

  • స్టీవ్ వా,మార్క్ వా : ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల్లో స్టీవ్ వా ఆస్ట్రేలియాకు 19 ఏళ్ల పాటు కెప్టెన్ గా ఉండి 72 శాతం విజ‌యాల‌ను అందించాడు.

  • మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ : ఆస్ట్రేలియాకు చెందిన ఈ బ్రోస్….లో మైక్ హ‌స్సీ మంచి పేరు సంపాదించుకున్నాడు.

  • డ్వాన్ బ్రావో, డారెన్ బ్రావో : వెస్టిండీస్ కు చెందిన ఈ బ్ర‌ద‌ర్స్ లో డారెన్ బ్రావో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఉన్న 10 మంది PKL ఆట‌గాళ్లు!

ప్ర‌స్తుతం PKL హ‌వా న‌డుస్తోంది. సూప‌ర్ రైడ్లు, సూప‌ర్ ట్యాకిల్స్, డూ ఆర్ డై అంటూ గ్రామీణ ఆట‌కు కార్పోరేట్ హంగును అద్దారు. దీంతో క‌బ‌డ్డీ ఆట‌గాళ్ల‌కు ఎప్పుడూ లేనంతా పేరు వ‌చ్చింది. అందులో ఈ 10 మంది ప్లేయ‌ర్స్ కు స్పోర్ట్స్ కోటాలో వివిధ ప్ర‌భుత్వ విభాగాల్లో జాబ్స్ కూడా వ‌చ్చాయి. అలా ఉద్యోగాలు సంపాధించిన 10 మంది PKL ఆట‌గాళ్ల‌ను ఇప్పుడు చూద్దాం!

  • సురేంద‌ర్ నాడా…… CISF

  • మ‌హేంద్ర గ‌ణేష్ రాజ్ పూత్ – మ‌హారాష్ట్ర పోలీస్

  • మ‌ణీంద‌ర్ సింగ్ – పంజాబ్ పోలీస్

  • న‌వీన్ కుమార్ – ఎయిర్ ఫోర్స్

  • నితిన్ తోమ‌ర్ – ఇండియ‌న్ నేవీ

  • ప‌వ‌న్ షెరావ‌త్ – ఇండియ‌న్ రైల్వేస్

  • రోహిత్ కుమార్ – ఇండియ‌న్ నేవీ

  • అజ‌య్ ఠాకూర్ – హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోలీస్ (DSP)

  • అనూప్ కుమార్ – హ‌ర్యానా పోలీస్

క‌బ‌డ్డీ లో మైండ్ గేమ్! చూసినోళ్లంతా నోరెళ్ల‌బెట్టారు!!

డిసెంబ‌ర్ 25న యుపి యోధా, పాట్నా పైరేట్స్ మధ్య బెంగ‌ళూరులో జ‌రిగిన పికేఎల్ మ్యాచ్ లో యుపి యోధా రైడ‌ర్ సురేంధ‌ర్ గిల్ త‌న మైండ్ గేమ్ ను చూపించాడు. ఈ ఊహించ‌ని ఘ‌ట‌న‌కు అంద‌రూ షాక్ అయ్యారు. చూస్తున్న వాళ్లంతా టెన్ష‌న్ టెన్ష‌న్ ప‌డుతుంటే అత‌ను మాత్రం చాలా కాలిక్యులేటెడ్ గా త‌న ప‌ని తాను కానిచ్చి యుపి యోధా టీమ్ ను గెలిపించాడు.

అస‌లేం జ‌రిగింది?
యుపి యోధా 35, పాట్నా పైరేట్స్ 34….. అది యుపి యోధాకు లాస్ట్ రైడ్ మ‌రియు డూ ఆర్ డై… పాట్నా టీమ్ లో ఏడుగురు ప్లేయ‌ర్స్ ఉన్నారు. రైడ‌ర్ ఔట్ అయితే మ్యాచ్ టై అవుతుంది. బోన‌స్ కు ఒక్క‌టే మార్గం… రైడ‌ర్ ఔట్ అయితే మ్యాచ్ టై గా ముగుస్తుంది. ఇదే స‌మ‌యంలో రైడ‌ర్ సురేంధ‌ర్ గిల్ త‌న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ను ఉప‌యోగించాడు.. కాసేపు బ్లాక్ లైన్ ద‌గ్గ‌ర ఆడిన సురేంధ‌ర్ స‌డెన్ గా బోన‌స్ దాటి పాట్నా ప్లేయ‌ర్స్ కు స‌రెండ‌ర్ అయ్యాడు. పాట్నా ప్లేయ‌ర్స్ అత‌డిని ప‌ట్టుకున్నారు. బోన‌స్ పాయింట్ యుపికి, టాకిల్ పాయింట్ పాట్నాకు… స్కోర్లు యుపి 36, పాట్నా 35… మ్యాచ్ యుపి గెలిచింది.

మూడుకు మూడు మ్యాచులూ టై! ప్రో క‌బ‌డ్డీలో ఏం జ‌రుగుతుంది?

జ‌న‌వ‌రి ఫ‌స్ట్ సంద‌ర్భంగా ప్రో క‌బ‌డ్డీ లీగ్ లో ట్రిపుల్ పంగా అంటూ నిర్వ‌హించిన మూడుకు మూడు మ్యాచులు టైగా ముగిశాయి. ఈ సీజ‌న్ ప్రారంభ‌మైన 10 రోజుల్లోనే 8 మ్యాచులు టైగా ముగిశాయి. జ‌న‌వ‌రి 1 న జ‌రిగిన మూడు మ్యాచులు టైగా ముగిశాయి.

జ‌న‌వ‌రి 1 న జ‌రిగిన మ్యాచ్ ల‌ను ప‌రిశీలిస్తే….

1) యుముంబా – యుపి యోధా ( 28-28)

2) బెంగుళూరు బుల్స్ – తెలుగు టైటాన్స్ ( 34-34)

3) ద‌బంగ్ డిల్లీ – త‌మిల్ త‌లైవాస్ ( 30-30 )

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగుతున్న మ్యాచుల‌ను గ‌మ‌నిస్తే అయితే టై అవుతున్నాయి లేక‌పోతే స్వ‌ల్ప పాయింట్ల‌తో విజ‌యాలు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌లే జ‌రిగిన వేలం… 7 సీజ‌న్ల మ్యాచుల‌ను చూసి ఆట‌గాళ్ల ప్ర‌తిభ‌ను అంచ‌నా వేసి మ‌రీ ప్రాంచైజీలు వేలంలో ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకున్నాయి కాబ‌ట్టి…..టీమ్ ను మంచిగా సెట్ చేసుకున్నారు. రైడ‌ర్లు, డిఫెండ‌ర్లు, ఆల్ రౌండ‌ర్లు ఇలా అన్ని విభాగాల్లో టీమ్ ను ప‌ర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకున్నారు. అందుకే ఒక టీమ్ బ‌లంగా ఉంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అదృష్టమంటే ఆ ఆట‌గాడిదే…లాస్ట్ ఇయ‌ర్ 20 ల‌క్ష‌లు ఇప్పుడు 8 కోట్లు!

గ‌త ఏడాది ఐపియ‌ల్ లో కోల్ క‌త్తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున ఆడిన వెంక‌టేష్ అయ్య‌ర్ రేటు ఇప్పుడు 40 రెట్లు పెరిగింది. IPL 2021లో 20 ల‌క్ష‌లు ప‌లికిన ఈ ఆట‌గాడికి ఈ యేడు 8 కోట్లు ప‌లికింది . ఇత‌ని ఆట‌తీరును మెచ్చిన KKR యాజ‌మాన్యం ఇత‌డిని 40 రెట్లు ఎక్కువ‌గా చెల్లించి మ‌రీ రిటైన్ చేసుకున్నారు. IPL 2021లో 10 మ్యాచులు ఆడిన వెంక‌టేష్ 310 ర‌న్స్ తో పాటు 3 వికెట్లు తీసుకున్నాడు.

KKR అండ్రూ ర‌స్సెల్ ను 12 కోట్ల‌కు, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని 8 కోట్ల‌కు, సునిల్ న‌రైన్ ను 6 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. అదే స‌మ‌యంలో ఆ టీమ్ కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన ఇయాన్ మోర్గాన్ ను ఓపెన‌ర్ శుబ్ మ‌న్ గిల్ ను వ‌దులుకుంది.

దారుణంగా దిగ‌జారిన స్టార్ ఆట‌గాళ్ల రేట్లు:
గ‌త ఏడాది 8.5 కోట్లున్న సునిల్ న‌రైన్ రేటు 6 కోట్ల‌కు దిగ‌జారింది. మాక్స్ వెల్ ఫ్రైజ్ 14.25 నుండి 11 కోట్ల‌కు, ధోని ఫ్రైజ్ 15 నుండి 12 కోట్ల‌కు, కోహ్లీ రేటు 17 నుండి 15 కోట్ల‌కు దిగ‌జారింది.

బేస్ ఫ్రైజ్ నుండి జాక్ పాట్ కొట్టిన యంగ్ ప్లేయ‌ర్స్ :
ఇదిలా ఉంటే 20 ల‌క్ష‌ల బేస్ ఫ్రైజ్ నుండి వెంక‌టేష్ అయ్య‌ర్ 8 కోట్ల‌కు, రుతురాజ్ గైక్వాడ్ 6 కోట్ల‌కు , అబ్దుల్ స‌మ‌ద్, ఉమ్రాన్ మాలిక్ , అర్ష‌దీప్ సింగ్ లను 4 కోట్ల‌కు పాత ప్రాంచైజీలే రిటైన్ చేసుకున్నాయి.

వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వాహ‌ణ ప‌ద్ద‌తి క‌రెక్టేనా? టైటిల్ ఆస్ట్రేలియాకు రావ‌డం స‌రైన‌దేనా?

T20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసింది. న్యూజీల్యాండ్ ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ కైవ‌సం చేసుకుంది. 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంకో ఓవ‌ర్ మిగిలుండగానే ఫినిష్ చేసింది ఆస్ట్రేలియా! అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వాహ‌ణపైనే చాలా మంది పెద‌వి విరుస్తున్నారు. ఆట‌గా కాకుండా కేవ‌లం కాసుల కోస‌మే క్రికెట్ అన్న‌ట్లు ఈ టోర్నిని నిర్వ‌హించార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. టైటిల్ ను డిసైడ్ చేసు విధానం కూడా క‌రెక్ట్ గా లేద‌ని విమ‌ర్శ‌లు సైతం వ‌స్తున్నాయి.

గ్రూప్ ల‌లో గ‌డ్ బ‌డ్ :

పాకిస్థాన్ ఇండియాల‌ను ఒక గ్రూప్ లో , ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ను ఒక గ్రూప్ లో వేసే సాంప్ర‌దాయం ఎప్ప‌టి నుండో కొన‌సాగుతుంది. ప్ర‌తి వ‌రల్డ్ క‌ప్ లో ఇండియా పాక్ లు త‌ల‌ప‌డాల్సిందే…..దీనికి కార‌ణం హైయెస్ట్ టిఆర్పీ రేటింగ్స్….. దీని త‌ర్వాత ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ….. ఈ మ్యాచ్ ల కార‌ణంగా అధిక రెవెన్యూను ఎర్న్ చేసే ప్లాన్

ఇక మ్యాచ్ లు కూడా గ్రూప్ లోనే ఆడిన‌ప్పుడు ….వేరే గ్రూప్ టీమ్స్ ను ఢీ కొట్టే ఛాన్స్ యే లేదు. ఇలా జ‌ర‌గ‌డం వ‌ల్ల నిజ‌మైన బ‌లాబ‌లాలు బ‌య‌టికి రావు. ప్ర‌తి టీమ్, పోటీలో ఉన్న అన్ని టీమ్ లతో క‌నీసం ఒక‌సారైనా పోటీ ప‌డ‌కుండా ఉండ‌డం క‌రెక్ట్ కాదు. నిజ‌మైన ఆల్ రౌండ్ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఇంగ్లాండ్, న్యూజీల్యాండ్ ల‌ను కాద‌ని ఆస్ట్రేలియాకు క‌ప్ రావ‌డం లో టాస్ ది ప్ర‌ధాన పాత్ర‌… మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ప్పుడు బాల్ ఆగి రావ‌డంతో ర‌న్స్ చేయ‌డం క‌ష్ట‌మౌతుంది. రెండ‌వ సారి బ్యాటింగ్ స‌మ‌యంలో బాల్ బ్యాట్ మీద‌కు వ‌స్తుంది కాబ‌ట్టి ర‌న్స్ చేయ‌డం ఈజీ అవుతుంది. ఆస్ట్రేలియా విష‌యంలో ఇదే జ‌రిగింది…సెకెండ్ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా విక్ట‌రీతో పాటు క‌ప్ ను సొంతం చేసుకుంది.

 

గ్రూప్ 1 నుండి సెమీస్ లోకి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా….గెలిచినా ఇంటిబాట ప‌ట్టిన SA.

గ్రూప్ 1 నుండి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీస్ కోసం త‌మ బెర్త్ ల‌ను ఖ‌రారు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ టేబుల్ టాప‌ర్ గా, ఆస్ట్రేలియా సెకండ్ టీమ్ గా ఉంది. సెమీస్ లో ఆస్ట్రేలియా గ్రూప్ 2 లో టాప్ లో ఉన్న పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ ఎవ‌రితో త‌ల‌ప‌డ‌నుంది అనేది న్యూజీల్యాండ్ ఆప్ఘ‌నిస్తాన్ మ్యాచ్ తో తెలుస్తుంది.

అయితే ఈ రోజు జ‌రిగిన మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రిక ఇంగ్లాండ్ ను ఓడించిన‌ప్ప‌టికీ నెట్ ర‌న్ రేట్ కార‌ణంగా ఇంటిబాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ద‌క్షిణాఫ్రికా త‌న బ్యాడ్ ల‌క్ ను నిరూపించుకుంది. ఆడిన 5 మ్యాచుల్లో4 మ్యాచుల్లో గెలిచి కూడా ఆ జ‌ట్టు టోర్ని నుండి నిష్క్ర‌మించింది.

Eng V/S SA మ్యాచ్ సమ్మ‌రీ :

RSA 189/2 (20)
ENG 179/8 (20)
South Africa won by 10 runs

PLAYER OF THE MATCH : Rassie van der Dussen 94(60)

 

పంత్, ధావన్ ల‌తో స‌హా12 మంది క్రికెట‌ర్ల‌ను టీమ్ ఇండియాకు అందించిన కోచ్ మృతి

రిష‌బ్ పంత్, శిఖ‌ర్ ధావ‌న్, ఆశిశ్ నెహ్రాలాంటి 12 మంది క్రికెట‌ర్ల‌ను టీమ్ ఇండియాకు అందించిన కోచ్ తార‌క్ సిన్హా ఢిల్లిలో త‌న నివాసంలో క‌న్నుమూశారు. సిన్హా గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఢిల్లీలో సోనెట్ క్ల‌బ్ పేరుతో అకాడ‌మీ స్థాపించిన సిన్హా పెళ్లి కూడా చేసుకోకుండా త‌న ద‌గ్గ‌ర‌క వ‌చ్చిన విద్యార్థుల‌కు క్రికెట్ లో శిక్ష‌ణ ఇస్తున్నారు.

సిన్హా అకాడ‌మీ నుండి టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయిన 12 మంది ప్లేయ‌ర్స్ వివ‌రాలు :

  • రిష‌బ్ పంత్
  • శిఖ‌ర్ ధావ‌న్
  • ఆకాశ్ చోప్రా
  • అంజుమ్ చోప్రా
  • ఆశిశ్ నెహ్రా

  • సురేంద‌ర్ ఖ‌న్నా
  • ర‌ణ్ ధీర్ సింగ్
  • మ‌నోజ్ ప్ర‌భాక‌ర్
  • ర‌మ‌ణ్ లాంబా
  • అజ‌య్ శ‌ర్మ
  • సంజీవ్ శ‌ర్మ
  • అతుల్ వాస‌న్
Next Page »