Advertisement
ఐపీఎల్లో ఇయాన్ మోర్గాన్ టోపీపై టోపీ పెట్టుకుని స్టేడియంలో కనిపించడం క్రికెట్ ప్రేమికుల్లో విపరీత చర్చకు దారితీసింది. మొన్న బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్మోర్గాన్ మైదానంలో రెండు టోపీలు పెట్టుకుని ఫీల్డింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Advertisement
అసలు విషయం ఏంటంటే.. కోవిడ్ తరువాత ఐసీసీ ఆట రూల్స్ మార్చివేసింది. సాధారణంగా బౌలర్ బౌలింగ్కు వచ్చినపుడు అతని స్వెట్టర్, క్యాప్ ఎంపైర్కి ఇచ్చేవారు. కానీ, కోవిడ్ కారణంగా మైదానంలో ఆటగాళ్లు సైతం సామాజిక దూరం పాటిస్తూ, ఒకరిని ఒకరు తాకడం లేదు. తాకకూడదని ఐసీసీ కూడా రూల్స్ విధించింది. అందుకే, బౌలర్లు తమ క్యాప్లను కెప్టెన్ తలపై పెడుతున్నారు. దీంతో కెప్టెన్లు, కొందరు ఆటగాళ్లు రెండు క్యాప్లతో కనిపిస్తున్నారు.
Advertisements
చెమట, చేతి స్పర్శ ద్వారా కూడా కోవిడ్ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని తొలిసారిగా ఇంగ్లండ్– వెస్టీండీస్ మ్యాచ్ల నుంచి అమలు చేసింది. అందుకే, కొందరు ఆటగాళ్లు మైదానంలో రెండు, మూడు క్యాప్లతో కనిపించడం ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తోంది.
Advertisements