Advertisement
“మనిషి తెలివికి కేవలం మార్కులు కొలమానం కాదు..జీవితంలో అంతకుమించి చాలా ఉన్నాయి” అని చెప్పుకుంటాం కానీ..అవన్ని మాటల వరకే పరిమితం అవుతాయి.. రియాలిటి వేరుంటుంది..రిజల్ట్ వచ్చేసరికి పిల్లల్ని పక్కింటి అమ్మాయి మార్కులతోనో, ఎదురింటి అబ్బాయి గ్రేడింగ్ తోనో పోల్చి చూస్తూ..నువ్వూ ఉన్నావు ..ఎందుకు పనికిరావు లాంటి ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి..మార్కులే జీవితం కాదు.. తన మార్కులు చూడండి అంటూ మార్కుల లిస్ట్ పోస్ట్ చేశారో IAS ఆఫీసర్..
అహ్మదాబాద్లోని అమ్దావాద్ మునిసిపల్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ గా పనిచేస్తున్నారు IAS ఆఫీసర్ నితిన్ సంఘ్వాని.ఇటీవల CBSE రిజల్ట్స్ రావడంతో ఒకప్పటి తన ప్లస్ 2 మార్క్స్ లిస్ట్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. “ ఇది నా పన్నెండవ తరగతి మార్కుల లిస్ట్..కెమిస్ట్రీలో నాకొచ్చిన మార్క్స్ 24.. జస్ట్ ఒకే ఒక్క మార్క్ తో పాసయ్యాను.. ఆ మార్క్స్ నా జీవితాన్ని నిర్ణయించలేదు.. నా లైఫ్లో నేనేం కావాలనుకున్నానో అదే అయ్యాను.. దానికి ఆ మార్క్స్ తో పని లేదు ” అంటూ ట్వీట్ చేశారు..
Advertisement
పిల్లలపై మార్కుల భారం వద్దు.. పరీక్షా ఫలితాలకంటే జీవితం చాలా ముఖ్యం అయినది అంటూ నితిన్ సంఘ్వాని పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ప్రతి ఏడాది SSC , ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తున్నాయంటే ఎంతమంది చిన్నారులు బలవన్మరణానికి పాల్పడుతూ ఉంటారో అని చాలామందిలో భయం కలుగుతూ ఉంటుంది… నితిన్ తన మార్క్ లిస్ట్ ని పోస్ట్ చేసి విద్యార్దుల్లో స్పోర్టివ్ స్పిరిట్ కలిగించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు..
Advertisements
Click:
In my 12th exams, I got 24 marks in Chemistry – just 1 mark above passing marks. But that didn't decide what I wanted from my life
Don't bog down kids with burden of marks
Life is much more than board results
Let results be an opportunity for introspection & not for criticism pic.twitter.com/wPNoh9A616
— Nitin Sangwan, IAS (@nitinsangwan) July 13, 2020
Advertisements