Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

4000 కుటుంబాలు నివ‌సించే కోట‌.! మన ఇండియాలోనే.!

Advertisement

సాధార‌ణంగా కోట‌లు అంటే ఒక‌ప్పుడు రాజులు నివాసం ఉండేవారు. కానీ ఇప్పుడు వాటిని ప‌ర్యాట‌క ప్రాంతాలుగా మార్చారు. కొంద‌రు బ‌డాబాబులు వాటిని హోట‌ల్స్‌గా, టూరిస్టు ప్లేసులుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. కొన్ని కోటలను ప‌ట్టించుకునేవారు లేక శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయి. అయితే ఆ కోట మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. దాన్ని అప్ప‌ట్లో రాజులు వ‌దిలిపెట్టాక అందులో కొన్నేళ్ల‌కు ప్ర‌జ‌లు నివాసం ఉండ‌డం మొద‌లు పెట్టారు. అవును.. ఇప్ప‌టికీ అందులో జ‌నాలు నివాసం ఉంటున్నారు. ఇంత‌కీ ఆ కోట ఎక్క‌డ ఉందంటే..?

రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్ ప్రాంతంలో ఉన్న కోట‌ను క్రీస్తు శ‌కం 1156లో అప్ప‌టి రాజు రావ‌ల్ జైశ్వాల్ నిర్మించారు. ఆ కోట‌ను యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా కూడా గుర్తించింది. అయితే అందులో ఆశ్చ‌ర్యంగా జ‌నాలు నివసిస్తున్నారు. అవును.. ఇలా ఎందుకు జ‌రిగిందంటే.. ఒక‌ప్పుడు ఆ కోట నిర్మానుష్యంగానే ఉండేది. కానీ అప్ప‌ట్లో సిల్క్ వ్యాపారం చేసే వ‌ర్త‌కులతోపాటు మ‌సాలా దినుసులు, టీ పొడి, విలువైన రాళ్ల‌ను అమ్మే వ్యాపారులు ఈ కోట వ‌ద్ద బ‌స చేసేవారు. దీంతో ఈ ప్రాంతం ర‌ద్దీగా మారింది. ఇక క్ర‌మంగా ఈ కోట‌లో జ‌నాలు నివాసం ఉండ‌డం మొద‌లు పెట్టారు. త‌రువాత వారి కుటుంబ స‌భ్యులు ఆ కోట‌లో కంటిన్యూ అయ్యారు. దీంతో ఇప్ప‌టికీ జ‌నాలు అందులో నివ‌సిస్తూనే ఉన్నారు.

Advertisement

ఈ కోట‌లో ప్ర‌స్తుతం సుమారుగా 4వేల మంది వ‌ర‌కు నివాసం ఉంటున్నారు. ఈ కోట 250 అడుగుల ఎత్తు ఉంటుంది. 25 అంత‌స్థుల ఎత్తు ఉన్న కొండ ప్రాంతంపై దీన్ని నిర్మించారు. ప‌సుపు రంగులో ఉండే శాండ్ స్టోన్ ఇటుక‌ల‌తో ఈ కోట‌ను నిర్మించారు. అందువ‌ల్ల ఈ కోట ఇప్ప‌టికీ ఇన్ని సంవ‌త్స‌రాలైనా ఇంకా చెక్కు చెద‌ర‌కుండా దృఢంగానే ఉంది. ఇక ఈ కోట‌కు మొత్తం 99 బురుజులు ఉన్నాయి.

Advertisements

Advertisements

ఈ కోట‌లో నివాసం ఉండే వారు త‌మ ఇళ్ల నిర్మాణాల‌పై సుమారుగా 3 అడుగుల ఎత్తులో బుర‌ద‌ను పేర్చుతారు. అందువ‌ల్ల వేస‌విలో కోటలో చ‌ల్ల‌గా ఉంటుంది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా ఈ కోట‌ను అప్ప‌ట్లో నిర్మించారు. ఇక ఈ కోట‌లో ఉండే అనేక కుటుంబాలు అన్నీ ప్ర‌ధానంగా టూరిజంపైనే ఆధార ప‌డ్డాయి. ఒక‌రికొక‌రికి వ్యాపారంలో పోటీ ఉంటుంది. అయినప్ప‌టికీ శుభ‌కార్యాలైనా, పండుగ‌లైనా, చావులైనా.. వీరందరూ ఆయా కార్య‌క్ర‌మాల‌ను క‌లిసే జ‌రుపుకుంటారు. వీరు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు.