Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఒక్క డైలాగ్ న‌చ్చి….. కొత్త డైరెక్ట‌ర్ కు 25వేల చెక్ ఇచ్చి స్టార్ట్ చేసిన సినిమా! రికార్డుల మోత మోగించింది!

Advertisement

2001 లో …. 15 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తీసిన  దేవి పుత్రుడు  సినిమా ప్లాప్  తర్వాత ప్రొడ్యూసర్  MS రాజు  ఆర్థికంగా బాగా లాస్ అయ్యారు.  ఆ సినిమా  ఎందుకు  ప్లాఫ్ అయిందో  ఆయనకు అర్ధంకావడంలేదు. ఏదో ఓ సినిమా తీసి మ‌ళ్లీ లైన్ లో ప‌డాల‌నే ప్ర‌య‌త్నంలో త‌న ఆప్తుడు గోపాల్ రెడ్డికి చెప్పాడు…. అప్పుడు గోపాల్ రెడ్డి అసిస్టెంట్  డైరెక్టర్ గా ప‌నిచేస్తున్న‌ VN ఆదిత్య ద‌గ్గ‌ర చాలా టాలెంట్ ఉంది…. ఓ సారి  ట్రై చెయ్  అని  ఆదిత్య  ఫోన్ నెంబర్ ఇచ్చాడు .

MS రాజు ,  ఆదిత్య కి నాలుగైదు  సార్లు  ఫోన్  చేయడం ,  ఆదిత్య  దానిని లైట్  తీసుకోవడం జరిగింది .అంత  పెద్ద ప్రొడ్యూసర్  తనతో  సినిమా ఎందుకు చేస్తాడులే  అనుకున్నాడు  ఆదిత్య. మొత్తానికి   ఒకరోజు  రాజు   ఆఫీస్ కి  వెళ్లి క‌లిశాడు. ఒక చిన్న  సినిమా చేద్దాం , నేను  రెండు లైన్లు  చెప్తా  ఏది  నచ్చితే  ఆ కథ రెడీ చెయ్  అని  రెండు లైన్లు  చెప్పాడు MS రాజు.  వాటిల్లో  రెండో  ఐడియా  నచ్చింది  ఆదిత్య కు.!

కథ మూలం :

ఎప్పుడో  1946 లో  రిలీజ్  అయిన  ఆన్ మోల్గడి అనే సినిమా  ఇన్స్పిరేషన్ తో  రాసుకున్న  లైన్ అది . బాగ్యా రాజా  తీసిన  డొలింగ్ డొలింగ్   షేడ్స్  కూడా దాంట్లో  ఉంటాయి .  అలా  MSరాజు, ఆదిత్య  స్క్రిప్ట్  పూర్తిచేశారు . హీరో వర్షంలో ఏడుస్తుంటే హీరో ఫ్రెండ్  ఒక డైలాగ్  చెప్తాడు….  ఒరేయ్ వర్షం  కూడా  అప్పుడప్పుడు  మనకి  మేలు  చేస్తుంది రా ,  మన  కన్నీళ్లు  కూడా  ఎదుటివారికి కనిపించకుండా  దాచేస్తుంది !   ఈ డైలాగ్ కు  MS రాజు  మనసు హత్తుకుంది .  వెంటనే  25 వేల రూపాయల  చెక్  రాసి  అడ్వాన్స్ గా  ఇచ్చి  మూవీ కన్ఫర్మ్  చేసాడు . పరుచూరి  బ్రదర్స్  స్క్రీన్ ప్లే  అందించారు .  తర్వాత రోజే   సినిమా  అనౌన్స్ చేశారు ,  టైటిల్ మనసంతా నువ్వే .

Advertisements

నటీ నటులు ఎంపిక :

Advertisement

మొదట  హీరోగా  మహేష్ బాబుని  అప్రోచ్  అయ్యారు , మ‌హేష్  అప్పటికే  గుణశేఖర్  డైరెక్షన్లో  ఒక మూవీ కమిట్  అయ్యి  ఉండ‌డంతో ఈ మూవీని రిజెక్ట్  చేసాడు . కొత్త  కుర్రాడు అయితే బాగుంటుందని  చెప్పాడు ఆదిత్య‌ .  చిత్రం  హీరో  ఉదయ్ కిరణ్ ను అప్రోచ్ అవుదామ‌నుకున్నారు….  ఆ టైంలో ఉదయ్  నువ్వు నేను   షూటింగ్ లో  ఉన్నాడు. నువ్వు నేను  రష్ ఫీడ్ చూసి ఉద‌య్ ను హీరోగా ఫిక్స్ చేశారు.


షూటింగ్:
వెంటనే  షూటింగ్  స్టార్ట్  చేసారు.  బడ్జెట్  కోటి ముప్పై లక్షలు .  అప్పటికి  నువ్వు నేను  రిలీజ్ కాలేదు కాబట్టి ,  అంత  తక్కువ  బడ్జెట్  సాధ్యమైంది . ముందుగా  రిలీజ్  అయిన‌  ఆడియో  బంపర్ హిట్  అయింది.   మలయాళం లో   ప్రణయ వర్ధంగళ్  అనే సినిమా  కోసం  విద్యాసాగర్  చేసిన  కన్నాడి కుడూమ్ కుట్టి  అనే  పాట  ట్యూన్ ని  యాజిటీజ్ తునిగా , తునిగా  సాంగ్ కు వాడేశారు! అలాగే  యాంటిక్ వాచ్  సౌండ్  కోసం  ఆర్ పి పట్నాయక్  చాలా కష్టపడ్డాడు .

రిలీజ్:

అప్పటికే  నువ్వు నేను  రిలీజ్  అయ్యి  ప్రభంజనం సృష్టించడంతో ,  ఉదయ్ కిరణ్ కి  స్టార్  హోదా వచ్చింది. దాంతో మ‌న‌సంతా నువ్వే సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అక్టోబర్  19  2001 లో  రిలీజైన  ఈ సినిమా కల్మషం లేని  ప్రేమక‌థగా ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌కాలం నిలిచిపోయింది!

బాక్స్ ఆఫీసు 

ఈ సినిమా ఉదయ్ కిరణ్ కు  వరుసగా  మూడో  బ్లాక్ బస్టర్ ను ఇచ్చింది. 36 సెంటర్లలో  100 రోజులు ఆడి…. 12 కోట్ల  షేర్ కలెక్ట్  చేసింది. ఈ  హిందీ , కన్నడ ,  తమిళ్ ,  బంగ్లాదేశి , ఒడియా లోకి రీమేక్  అయింది . సునిల్ స్టార్ క‌మెడియ‌న్ గా, ఆదిత్య‌ను డైరెక్ట‌ర్ గా ,ఉద‌య్ కిర‌ణ్ ను యూత్ ఐకాన్ గా నిల‌బెట్టింది.

Advertisements

దీని  తర్వాత  ఇలాంటి  లవ్ స్టోరీస్  ఎన్ని  వచ్చినా  మనసంతా  నువ్వే మాత్రం  హంట్  చేస్తూనే  ఉంటుంది .  చనిపోయిన  ఉదయ్ కిరణ్ ని  ఎప్పుడూ బ్రతికిస్తూనే  ఉంటుంది .