Advertisement
అప్పటి వరకు ….కత్తులు కటార్లతోనే సాగుతున్న యుద్ధం వీటి రాకతో కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాతశత్రు… లిచ్చావీ రాజ్యాన్ని సునాయాసంగా ఓడగొట్టాడు..అప్పటి వరకు పాశ్చాత దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు అజాతశత్రు.
పంగల కర్ర ( ఉండేలు) కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ పరికరంలో …మొదట తాడును,తర్వాత ఎలాస్టిక్ ను, తర్వాత స్ప్రింగ్స్ ను ఉపయోగించి …పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువుల పైకి విసిరేవారు. దీంతో శత్రు మూక చెల్లాచెదురయ్యేది. తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడారు. ఫిరంగులు రాకతో వీటి ఉపయోగం తగ్గిపోయింది.
Advertisement
ఎంటర్టైన్మెంట్ కోసం కూడా దీని ఉపయోగించేవారు….దూరంగా వలను ఏర్పాటు చేసి ..ఇందులోనుండి మనిషిని వల లోకి విసిరేసేవారు. నీటి జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేసేవారు….. మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక 2 – 3 చనిపోయారు కూడా.!
ఏదిఏమైనా …చాలా రాజుల విజయాల్లో కీలకపాత్ర పోషించి ఈ పరికరం ..బాహుబలి సినిమా ద్వారా మరోసారి కనిపించింది .
Advertisements
Advertisements